Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎమ్మెస్ నారాయణ ఇంట్లో మరో విషాదం
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకరైన ఎంఎస్ నారాయణ సరిగ్గా ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబం ఇంకా విషాదం నుండి తేరుకోక ముందే మరో విషాదం చోటే చేసుకుంది.
ఎంఎస్ సతీమణి కళాప్రపూర్ణ (63) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంత కాలంగా గుండె సంబంధ వ్యాధితో బాధ పడుతున్న ఆమె సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితమే ఎంఎస్ మొదటి వర్థంతి జరిగింది.
ఎమ్మెస్ బ్రతికున్న సమయంలో తన భార్య గురించి మాట్లాడుతూ...తమది ప్రేమ వివాహం, తన దగ్గరకు ట్యూషన్ కు వచ్చే స్టూడెంట్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెద్దలు మా పెళ్లికి ఒప్పుకోక పోవడంతో తన లెక్చరర్ అయిన పరుచూరి గోపాల క్రిష్ణ తమ పెళ్లి చేసారని, తాను సినిమాల్లోకి రావడానికి తన భార్య ప్రోత్సాహం చాలా ఉందని ఎమ్మెస్ తెలిపారు.
తాను సినిమా అవకాశాల కోసం కష్టపడిన సమయంలో తన భార్య కళాప్రపూర్ణ ఇంటి బాధ్యతలు చూసుకునేది, ఆమె సహాయం లేకుండా నేను ఇంతవాన్ని అయ్యేవాన్ని కాదు అని ఎమ్మెస్ అప్పట్లో అనేవారు.