Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! రంగంలోకి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
రజనీకాంత్ కూతురు వెడ్డింగ్ రిసెప్షన్: భార్యతో కలిసి హాజరైన ముఖేష్ అంబానీ
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతరు సౌందర్య వివాహం అపెక్స్ లాబోరేటరీస్ డైరెక్టర్ విశాగన్తో ఫిబ్రవరి 11 వైభవంగా జరిగింది. చెన్నైలోని లీలా ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
పెళ్లి అనంతరం గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. కొత్త దంపతులను ఆశీర్వదించడానికి పలువురు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ముంబై నుంచి భారత కుబేరుడు, రిలయన్స్ గ్రూఫ్ అధినేత ముఖేష్ అంబానీ తన భార్య నీతా అంబానీతో కలిసి రావడం విశేషం.
నెల రోజుల క్రితం ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన ఆయన కూతురు ఇషా అంబానీ-ఆనంద్ పిరమాల్ పెళ్లి వేడుకకు రజనీకాంత్ తన భార్యతో కలిసి అటెండ్ అయిన సంగతి తెలిసిందే. ముఖేష్ అంబానీ దంపతులతో పాటు బాలీవుడ్ నటి కాజోల్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
సౌందర్య దర్శకురాలిగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. విశాగన్ గతేడాది 'వంజగర్ ఉలగమ్' అనే సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఇద్దరికీ ఇది రెండో వివాహమే కావడం గమనార్హం. సౌందర్య మొదటి వివాహం అశ్విన్ రామ్ కుమార్తో 2010 జరిగింది. 2016లో వీడిపోయారు. వీరికి వేద్ కృష్ణ అనే బాబు కూడా ఉన్న సంగతి తెలిసిందే.