Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ చరణ్ 'తుఫాను' టీమ్ కు హైకోర్టు షాక్
హైదరాబాద్: రాంచరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న చిత్రం 'జంజీర్'. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 'తుఫాను' పేరుతో తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందించిన ట్రైలర్స్ హైదరాబాద్ లో విడుదల చేసారు. అయితే ముంబై హై కోర్టు తక్షణమే ఈ ట్రైలర్స్ ని విత్ డ్రా చేసుకోమని ఆర్డర్ వేసింది. అలాగే హిందీ వెర్షన్ ట్రైలర్స్ మీద కూడా ఆంక్షలు విధించింది.
దానికి కారణం... ఈ చిత్రం కాపీ రైట్స్ విషయంలో కోర్టులో కేసు నలుగుతూ ఉండటమే. ఈ చిత్ర నిర్మాత అమిత్ మెహ్రాకు వ్యతిరేకంగా అతని సోదరులు (ప్రకాష్ మెహ్రా కుమారులు) సుమీత్, పునీత్ కోర్టుకు వెళ్లారు. ఈ విషయమై వారి లాయిర్ మాట్లాడుతూ... " జంజీర్ రీమేక్ కు సంభందించిన ట్రైలర్స్ ని ఆపుచేయమని హై కోర్టు సోమవారం మధ్యాహ్నం తీర్పు ఇచ్చింది. మేము సర్టిఫైడ్ కాపీలు కోసం అప్లై చేసుకున్నాం ." అన్నారు.
ముందుగా అనుకున్న డబ్బు సెటిల్ చేసి ఇవ్వకపోవటం వల్ల జంజీర్ రైట్స్ కాన్సిల్ చేస్తున్నట్లు హక్కుదారులు తేల్చి చెప్పి కోర్టు కెక్కారు. ఇక ఈ వివాదం మొదలైంది చిత్రం రైట్స్ కి చెందిన ముగ్గురు అన్నదమ్ముల మధ్యనే కావటం విశేషం. తమ తండ్రి నిర్మించిన జంజీర్ రైట్స్ కొడుకులకు రాగా, అందులో ఒకతను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మిగతా ఇద్దరు సోదరులకు హక్కులు తాలుకు డబ్బులిస్తానని చెప్పాడు.
కానీ మొదట అనుకున్న ప్రకారం ఇవ్వకపోవటంతో వారు కోర్టుకు ఎక్కారు. ఇప్పుడు వ్యవహారం కోర్టుకు వెళ్లింది. సినిమా షూటింగ్ కి ఇది ఏ విధమైన ఇబ్బంది ఎదురౌతుందో అనే సందేహంలో ఇప్పుడు హీరో, దర్శకులు పడ్డారు. ముఖ్యంగా ఇప్పుడెలా ఉన్నా విడుదల సమయంలో ఏ విధమైన లీగల్ తలనొప్పులూ ఉండకూడదు. అప్పుడు క్లియరెన్స్ రాకపోతే చాలా పెద్ద సమస్య. ఈ లోగా సెటిల్ చేసుకుంటారనే అనుకుంటున్నారు.
ఇక ట్రైలర్స్ విడుదల చేయటంతో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మొదట్లో అందరూ దీన్నో డబ్బింగ్ సినిమాగా పరిగణించారని, ట్రైలర్స్ విడుదల అయ్యాక ఒక్కసారిగా ఊహించని రీతిలో క్రేజ్ పెరిగిందని చెప్తున్నారు. 'తుఫాను' తెలుగు వెర్షన్ కి దర్శకుడు యోగి దగ్గరుండి తెలుగు నేటివిటీ అద్దటం ప్లస్ అయ్యిందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ మంచి మొత్తానికి అమ్ముడయ్యాయి. గబ్బర్ సింగ్ రేంజిలో ఈ పోలీస్ చిత్రం కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుందని భావిస్తున్నారు.