Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగస్టార్ సైరాకు న్యాయం చేయగలిగేది అతడే!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి, నయనతార మరియు జగపతి బాబు సహా ప్రధాన నటులంతా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. సైరా చిత్రానికి సంబంధించిన నిర్ణయం ఏదీ వెంటనే జరగడం లేదు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం కావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. హీరోయిన్ ఎంపిక విషయంలో చాలా మంది పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. చివరకు నయనతారని ఓకే చేసారు.
సంగీత దర్శకుడి విషయంలో ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. మొదట ఏఆర్ రెహమాన్ ని అనుకున్నారు. కానీ రెహమాన్ అనుకోని కారణాల వలన ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత కీరవాణి పేరు వినిపించింది. తాజాగా బాలీవుడ్ సంగీత దర్శకుడు త్రివేది పేరు వినిపిస్తోంది. సైరా చిత్ర యూనిట్ అమిత్ త్రివేది గత చిత్రాలని పరిశీలించి ఇతడైతే సైరా చిత్రానికి న్యాయం చేయగలుగుతాడని భావిస్తున్నారట. సంగీత దర్శకుడి ఎంపీలలో ఇక తుది నిర్ణయమే మిగిలి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.