మా సినిమాలో వైయస్ జగన్ ని విమర్శించలేదు
అవినీతికి పాల్పడేవారికోసం యువ నాయకుడు వస్తున్నాడని సినిమాలో చూపించాం.ఆయువ నాయకుడు జగన్ అని ఊహించుకున్నారు కొందరు అన్నారు నిర్మాత నంది శ్రీహరి. ఆయన తాజా చిత్రం 'నగరం నిద్రపోతున్న వేళ' గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే తాను షిర్డీలో ఉండగా అనేక ఫోన్లు వచ్చాయనీ, అవన్నీ యువ నాయకుడు వైయస్.జగన్నుద్దేశించే సినిమాలో ప్రస్తావించారనీ, అలా ఎందుకు చూపారనీ వారు ప్రశ్నించారు.ఇంకొందరు కాంగ్రెస్కు వ్యతిరేకమా? అని అడుగుతున్నారు. నేను తీసింది ప్రస్తుత వ్యవస్థను ఉద్దేశించి తీశాను .అందుకే వివరణ ఇవ్వడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశానన్నారు.త్వరలో జగపతిబాబు, చార్మిలతో సక్సెస్ టూర్ చేయనున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. జగపతి బాబు, చార్మి కాంబినేషన్ లో ప్రేమ్రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది.


Click it and Unblock the Notifications











