Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దర్శకేంద్రుడి ప్లాన్, నాగార్జున కలియుగ దైవం పాత్రలో...
హైదరాబాద్: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కలిసారంటే..... వెండితెరపై ఒక అద్భుతమైన భక్తిరస చిత్రం రావాల్సిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి చిత్రాలు మంచి విజయం సాధించాయి.
వీరి కాంబినేషన్ మరో భర్తిరస చిత్రం కాబోతోంది. ఈ సారి నాగార్జున శ్రీ వెంకటేశ్వర స్వామిగా కనిపించనున్న ఈ చిత్రానికి 'ఓం నమో వేంకటేశాయ' అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని స్వయంగా రాఘవేంద్ర రావునే నిర్మించతోతున్నట్టు సమాచారం.
రాఘవేంద్రరావు తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యుడిగా ఇటీవల ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవెంకటేశ్వర స్వామిపై పై ఈ సినిమాను తెరకెక్కించాలనుకోవడం చర్చనీయాంశం అయింది. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యుడిగా రాఘవేంద్రరావు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో నాగార్జున కూడా పాల్గొన్నారు.
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు ఏడుకొండల వాడి భక్తుడు ‘అన్నమయ్య' పాత్రలో అలరించిన నాగార్జున ఇపుడు ఏడు కొండల వాడి పాత్రలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి కూడా కీరవాణి సంగీతం అందించే అవకాశం ఉంది.