Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తుదిశ్వాస వరకు హరికృష్ణ ఆ రెండింటితోనే.. ఇక లేరన్న వార్తతో షాక్లో..
తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటే హరికృష్ణ ఎంతో ఇష్టం. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, మంత్రిగా సమైక ఆంధ్రప్రదేశ్లో విశేష సేవలందించారు. ఇలా ప్రజాసేవ, కళామతల్లికి సేవ చేస్తున్న హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందారు. హరికృష్ణ మృతి నేపథ్యంలో ఆయన గురించి ఆసక్తికరమైన అంశాలు..
చైతన్య రథసారథిగా
స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ప్రచారం కోసం వాడిన చైతన్య రథానికి సారథిగా హరికృష్ణ వ్యవహరించాడు. రాష్ట్రం నలువైపులా ఎన్టీఆర్ చేసిన ప్రచారంలో భాగమయ్యాడు. చైతన్య రథాన్ని హరికృష్ణ సమర్ధవంతంగా నడిపించి పార్టీ విజయంలో కీలక పాత్ర వహించాడు.
డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం
సాధారణంగానే హరికృష్ణకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఏ సందర్భంలోనైనా స్వయంగా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తాడు. వేగంగా వాహనాన్ని నడపినా ఆయనకు వెహికిల్పై పూర్తి కంట్రోల్ ఉంటుంది.
పసుపు రంగు చొక్కా
అలాగే హరికృష్ణకు పార్టీ చొక్కా కలర్ పసుపు రంగు అంటే చాలా ఇష్టం. పార్టీ కార్యక్రమాలకు పసుపు చొక్కానే ధరిస్తాడు. ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా పసుపు రంగులో ఉంటే టీషర్టులు వేసుకొంటారు.
Recommended Video
జీవిత చివరి అంకంలో కూడా
మంగళవారం రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణ స్వయంగా వాహనం నడుపుతూ ఉన్నారు. అలాగే పసుపు రంగు టీషర్ట్ ధరించి ఉండటం గమనార్హం. చివరి శ్వాస సమయంలో కూడా ఈ రెండు ఆయనతో ఉండటం చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆయన ఇక లేరన్న విషయాన్ని తలుచుకొని శోకసంద్రంలో మునిగిపోయారు.