Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సర్ప్రైజ్: జై లవకుశ లోకి సావిత్రొచ్చిందీ.. , గప్చుప్ గా షూట్ కూడా చేసేసారట
జై లవకుశ లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే ఇప్పుడు ప్రేమ కథా చిత్రంలో దెయ్యంగా అలరించిన నందితా రాజ్ ను ఓ కీలక పాత్రకు తీసుకున్నారట. చిన్న రోల్ అయినా.. ఈమె పాత్ర బాగా ఆకట్టుకుంటుందట.
ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రమిది. జై లవకుశ అని ప్రచారవవుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రానికి తారక్ సోదరుడు కల్యాణ్ రామ్ నిర్మాత. ఈ చిత్రానికి ఇద్దరు హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్నారు. విలన్ ఛాయలున్న ఓ పాత్ర కోసం ప్రత్యేకంగా హలీవుడ్ నుంచి మేకప్ మెన్ రప్పించిన సంగతి తెలిసిందే. ఊక్కొక్క విషయాన్నే నెమ్మదిగా రివీల్ చేస్తూ తరచూ వార్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు బాబీ. ప్రతీ స్టెప్ నీ జాగ్రత్తగా పబ్లిసిటీ అయ్యేవిధంగా చూసుకుంటున్నాడు.
జై లవ కుశ
ముఖ్యంగా క్యాస్టింగ్ విషయంలో డైరెక్టర్ తీసుకుంటున్న స్టెప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.. అంచనాలు పెంచేస్తున్నాయి. జై లవ కుశలో రాశి ఖన్నా హీరోయిన్ అంటూ షూట్ స్టార్ట్ చేసి.. రీసెంట్ గా నివేదా థామస్ పేరు అనౌన్స్ చేశారు. ఇక హంసా నందినితో ఓ పాటతో పాటు కొన్ని సీన్స్ చిత్రీకరించనున్నారట.
మూడో రోల్ కి హీరోయిన్ ఉండదన్నారు
ఈ సినిమాలో.. ఇప్పటివరకూ రాశిఖన్నాను మాత్రమే హీరోయిన్ గా ప్రకటించారు. మరో హీరోయిన్ పాత్రకు నివేదా థామస్ ను దాదాపుగా ఖాయం చేశారు అన్న సమాచారం అయితే ఉంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ చేస్తున్న మూడో పాత్రకు హీరోయిన్ ని కూడా ప్రకటిస్తారని భావించారు కానీ.. అసలు మూడో రోల్ కి హీరోయిన్ ఉండదన్నది ఒక వార్త.
లేటెస్ట్ అప్ డేట్
కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే ఇప్పుడు ప్రేమ కథా చిత్రంలో దెయ్యంగా అలరించిన నందితా రాజ్ ను ఓ కీలక పాత్రకు తీసుకున్నారట. చిన్న రోల్ అయినా.. ఈమె పాత్ర బాగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఇప్పటికే నందితా రాజ్ తో షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసేశారట కూడా.
ప్రేమకథా చిత్రం
నీకు నాకు డాష్ డాష్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నందితా కు తెలుగులో వరుసగా సినిమాలు వచ్చాయి . వాటిలో ప్రేమకథా చిత్రం , బస్ స్టాప్ ,లవర్స్ చిత్రాలు హిట్ కాగా కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని నటిగా నందితా రాజ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది .
శంకరాభరణం , సావిత్రి
ఆ సినిమా తర్వాత చేసిన శంకరాభరణం , సావిత్రి చిత్రాలు ప్లాప్ అయ్యాయి దాంతో పాపం ఈ భామ మరుగున పడిపోయింది అవకాశాలు సన్నగిల్లాయి . అలాంటి సమయం లోనే వచ్చిన ఈ ఆఫర్ నందితకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. మరి తారక్ లాంటి స్టార్ ఉన్న సినిమాలో రోల్ చేసాక అయినా నందితా కెరీర్ మంచి మలుపు తీసుకుంటుందా అన్నది చూడాలి.