Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
200 మంది అమ్మాయిల్లో పూరి ఫైనల్ చేసింది ఈవిడనే, కొడుకు కోసమే ఇదంతా...
పూరి నెక్ట్స్ మూవీలో హీరోయిన్ ఖరారైంది. నెహా శెట్టి అనే కన్నడ బ్యూటీని ఎంపిక చేశారు.
బాలయ్యతో 'పైసా వసూల్' తర్వాత పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా పనుల్లో బిజీ అయిపోయారు. తన తనయుడు ఆకాష్ హీరోగా ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కించబోతున్నారు. ఆకాష్ సరసన హీరోయిన్ కోసం పూరి దాదాపు 200 మంది కొత్త అమ్మాయిలను ఆడిషన్ చేశారు.
200 మంది అమ్మాయిలకి ఆడిషన్స్ నిర్వహించిన తరువాత, ఫైనల్గా ఒక అమ్మాయిని ఎంపిక చేశారని, ఆమె పేరు 'నేహా శెట్టి' అని తెలుస్తోంది. ఈవిడపై ఫోటో షూట్, ట్రయల్ షూట్ కూడా నిర్వహించి తన సినిమాకు సూటవ్వడంతో పాటు, ఆకాష్కు కూడా సరిజోడిగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
నేహా శెట్టి
నేహా శెట్టి కర్నాటకకు చెందిన అమ్మాయి. కన్నడలో ఇప్పటికే 'ముంగారు మలే 2' అనే సినిమాలో నటించింది. ఇపుడు ఆకాష్ పూరి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది.
మిస్ మంగుళూరు పజంట్
నేహా శెట్టి.... మంగుళూరు అందాలపోటీల్లో నెగ్గింది. మిస్ మంగుళూరు పజెంట్ అనే టైటిల్ విన్నర్ గా నిలిచింది. దాని తర్వాత ఆమె సినిమా రంగం వైపు అడుగులు వేశారు.
పూరి స్టైల్ మేకింగ్
పూరి స్టైల్ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సారి తన కొడుకు సినిమా కావడం, అతడి భవిష్యత్తును నిర్ణయించే సినిమా కావడంతో పూరి జగన్నాథ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆకాష్ పూరి
బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన ఆకాష్ 2015లో హీరోగా చేసిన ‘ఆంధ్రపోరి' సినమా అంతగా సక్సెస్ కాకపోవడంతో కొంత విరామం తీసుకున్నాడు. అయితే ఈ గ్యాప్ లో ఆకాష్ నటనతో పాటు డాన్స్, యాక్షన్, హార్స్ రైడింగ్ లాంటి వాటిలో శిక్షణ తీసుకున్నాడు.
అంచనాలు భారీగానే
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్కు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఆయన సినిమా కోసం ఎదురు చూసే అభిమానులు ఎందరో. ఈ సారి సొంత కొడుకుతోనే సినిమా చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.