Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రామానాయుడు ‘నేనేం చిన్న పిల్లనా?’(ఫోటోలు)
హైదరాబాద్ : సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మిస్తున్న చిత్రం 'నేనేం చిన్నపిల్లనా?' ఆడియో వేడుక శనివారం హైదరాబాద్లో జరిగింది. హీరో వెంకటేష్ ఆడియో సీడీ విడుదల చేసి రానా, రామానాయుడుకు అందజేశారు.
రాహుల్, తన్వీ వ్యాస్ జంటగా నటిస్తున్న ఈచిత్రాన్ని పి.సునీల్కుమార్రెడ్డి దర్శకత్వం వహించారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు.
ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ- మంచి బాణీలతో ఆరు పాటలు ఇందులో ఉన్నాయని, ఆడియో హిట్ అయి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు వస్తుందని తెలిపారు. చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదం పంచే విధంగా ఉంటుందని ఆయన తెలిపారు.
ఆడియో వేడుకకు సంబంధించిన పోటోలతో పాటు, సినిమా గురించి దర్శకుడు మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...
ఆడియో ఆవిష్కరణ
నేనేం చిన్న పిల్లనా? ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత రామానాయుడు, హీరోలు వెంకటేష్, రాణా. కథానాయకుడు రాహుల్, దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖలను కూడా ఈ దృశ్యంలో చూడొచ్చు.
సీడీలు విడుదల చేసిన వెంకటేష్
ఆడియో సీడీలను హీరో వెంకటేష్ విడుదల చేసి నిర్మాత రామానాయుడు, హీరో రాణాలకు అందజేసారు. మంచి బాణీలతో ఆరు పాటలు ఇందులో ఉన్నాయని, ఆడియో హిట్ అయి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు వస్తుందని నిర్మాత తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ...
స్వేచ్ఛ కోరుకునే ఓ యువతి సమాజంలో కొందరి వ్యక్తులను కలిసినపుడు ఎటువంటి అపోహలకు గురైందీ, ఆ తర్వాత పరిణామాలేంటి అన్న అంశంతో ఈ చిత్రాన్ని నిర్మించామని, పెద్ద సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మించినందుకు సంతోషంగా ఉందని దర్శకుడు సునీల్కుమార్ రెడ్డి తెలిపారు.
ఇతర వివరాలు
కథకు సరైన పేరుగా అందరూ ఒప్పుకుంటారని సంగీత దర్శకురాలు శ్రీలేఖ తెలిపారు. కార్యక్రమంలో తన్వి వ్యాస్, రాహుల్, భాస్కరభట్ల, శరత్బాబు, సత్యానంద్, వనమాలి, అనంత్ శ్రీరామ్, ఎల్బీ శ్రీరామ్, అన్నపూర్ణ, మార్తాండ్ కె.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సుమన్, అలీ, ఏవిఎస్, జయప్రకాష్రెడ్డి, రఘుబాబు, కాశీవిశ్వనాథ్, జీవా, వేణుమాధవ్, ఉత్తేజ్, శివారెడ్డి, సంజన నటిస్తున్నారు.