Don't Miss!
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేశ్ బాబు సినిమాలో అనుష్క: అసలు విషయం తెలిసి నోరెళ్లబెడుతోన్న ఫ్యాన్స్
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ మధ్య కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను'తో భారీ హిట్ను అందుకున్న అతడు.. ఆ తర్వాత వంశీ పైడిపల్లి తీసిన 'మహర్షి'తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక, ఈ మధ్య అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు'తో హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే పరశురాంతో కలిసి 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ గురించి తాజాగా బయటకు వచ్చిన ఓ న్యూస్ కలకలం రేపుతోంది.
కరోనా ప్రభావంతో షూటింగ్ వాయిదా పడిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి కీలక పాత్రను పోషిస్తుందని తాజాగా ఓ ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందునా అది దర్శకుడు పరశురాం పోస్ట్ చేసినట్లు ఉండడంతో ఇది నిజమేనని అంతా అనుకున్నారు. కానీ, ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని తర్వాత తెలిసింది.
It is very pleasure to welcome @MsAnushkaSetty garu to #SarkaruVaariPaata team. Thanks for playing a powerful role in our film. I sure you will rock as bank manager role in our film. Can't wait to start shooting🥰@MythriOfficial #MaheshBabu @14ReelsPlus pic.twitter.com/wiNbvxiR5T
— Parasuram Petla (@ParasuramPetla5) November 17, 2020
అసలేం జరిగిందంటే.. పరశురాం పెట్లా అనే పేరుతో ఓ నెటిజన్ ట్విట్టర్లో అకౌంట్ క్రియేట్ చేశాడు. అది కూడా అచ్చం ఆ దర్శకుడి అధికారిక ఖాతాలాగే మెయింటైన్ చేశాడు. దీంతో అనుష్క వార్తను నిజమేనని అంతా నమ్మేశారు. ఇప్పుడు అసలు విషయం బయటకు రావడంతో అందరూ నోరెళ్లబెట్టేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.
ఇదిలాఉండగా, వరుస విజయాలతో దూసుకుపోతోన్న మహేశ్ బాబు చేస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైనర్స్తో కలిసి మహేశ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీలో బ్యాంకులను మోసం చేస్తున్న బడా బాబులను టార్గెట్ చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.