Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
దర్శకేంద్రుడికి నచ్చిన కొత్త హీరోయిన్
లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్పై చిత్రాన్ని నిర్మించే సన్నాహాల్లో భాగంగా పరిసరాల పరిశీలన నిమిత్తం ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు కంచికచర్ల విచ్చేశారు. స్థానిక శ్రీ శివసాయి క్షేత్ర పరిసరాలను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు గద్దె ప్రసాద్, పావని దంపతులు, వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు విలేకరులతో మాట్లాడుతూ లకీప్రసన్న పిక్చర్స్ బ్యానర్పై నిర్మించే ఈ చిత్రం (ఇంకా పేరు పెట్టలేదు) లో విలక్షణ నటుడు మోహన్బాబు కుమారుడు మంచు మనోజ్కుమార్ హీరోగా నటిస్తారని చెప్పారు.
ఆయనకు జోడీగా తపస్వి అనే నూతన తారను పరిచయం చేస్తున్నామన్నారు. ఈ చిత్రంలో ఇంకా తనికెళ్ల భరణి, సుధ, ఆహుతి ప్రసాద్ తదితరులు నటిస్తారన్నారు. ప్రముఖ ఛాయాగ్రహకుడు ఎస్ గోపాల్రెడ్డి కెమెరామన్గా వ్యవహరిస్తారన్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి శివసాయి క్షేత్ర ప్రాంగణంలో వారం రోజులపాటు ఓ పాటను చిత్రీకరించనున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చిత్రీకరించే ఈ గీతానికి శివసాయి క్షేత్రం లొకేషన్ చక్కగా సరిపోతుందని, దీంతో ఇక్కడ షూటింగ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు తండ్రి శ్రీమన్నారాయణ (చిన్ని), మాజీ సర్పంచ్ గద్దె సరస్వతి పాల్గొన్నారు.