Just In
- 35 min ago
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- 10 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 11 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్తో భర్తతో శ్రియ రచ్చ
- 11 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
Don't Miss!
- Finance
బడ్జెట్, ఇన్వెస్టర్ల ఆందోళన: 4 రోజుల్లో 2400 పాయింట్లు, రూ.8 లక్షల కోట్లు ఆవిరి
- News
ఉలిక్కిపడ్డ విశాఖ: మరో భారీ అగ్నిప్రమాదం: రాత్రంతా: ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లి కాలేదు మొర్రో.. అదంతా అబద్ధం.. నితిన్ పెళ్లిసందడి రచ్చ రచ్చ..
టాలీవుడ్ హీరో నితిన్ తన పెళ్లి వార్తలపై క్లారిటి ఇచ్చేశాడు. గత రెండు రోజులుగా ఇంటర్నెట్లో నితిన్ పెళ్లి జరిగిందంటూ ఓ ఫోటో వైరల్గా మారింది. దాంతో నితిన్ తన పెళ్లికి సంబంధించిన వార్త గురించి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత దిల్రాజు నిర్మాణ సారథ్యంలో రాశీఖన్నాతో కలిసి శ్రీనివాస కళ్యాణం అనే చిత్రంలో నితిన్ నటిస్తున్నాడు. ఈ చిత్రం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది.

నితిన్ రాశీఖన్నాలపై
శ్రీనివాస కళ్యాణం షూటింగ్లో భాగంగా నితిన్, రాశీఖన్నాపై పెళ్లి సీన్ను చిత్రీకరించారు. పెళ్లిపీటల మీద నూతన దంపతులుగా కనిపించిన రాశీఖన్నా, నితిన్ ఫొటోలను రిలీజ్ చేయగా అవి వైరల్ అయ్యాయి.

నితిన్ ఫోటోను కట్ చేసి
పెళ్లి ఫోటోల నుంచి నితిన్ను మాత్రమే కట్ చేసి వాటిని యూట్యూబ్లో సెన్సేషన్ చేశారు. నితిన్ పెళ్లైంది. పెళ్లికూతురు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు అని హెడ్డింగ్ పెట్టి పబ్లిష్ చేశారు.

నా జర్నీ ప్రారంభమైంది
దాంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయింది. వీటికి తోడు ట్విట్టర్లో నా జర్నీ ప్రారంభమైంది అంటూ ట్వీట్ చేయడం ఆ వార్తకు మరింత బలం చేకూరింది.

దిల్ రాజు నిర్మాతగా
శ్రీనివాస కల్యాణం సినిమా ప్రారంభమైంది. చిత్రం ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొంటున్నది. ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు అని నితిన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. చాలా ఏళ్ల తర్వాత దిల్ రాజు నిర్మాణంలో నితిన్ నటించడం గమనార్హం.

సతీష్ వెగ్నేష దర్శకత్వంలో
శతమానం భవతి దర్శకుడు సతీష్ వెగ్నేశ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్తో రాశీఖన్నా జోడికట్టింది. మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.