Just In
- 18 min ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 56 min ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 1 hr ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 1 hr ago
మోనాల్తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్గా.. ఊహించని విధంగా కామెంట్స్!
Don't Miss!
- Sports
'సిరాజ్ భాయ్.. ఇంత మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని ఊహించలేదు'
- News
బిడెన్కు అప్పుడే అభిమానులు పుట్టుకొచ్చారు: బాటిల్లో మినియేచర్: ఎవరీ ఈశ్వర్ రావు: గిఫ్ట్గా
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సినీ రంగానికి మరో విషాదం నృత్య దర్శకుడు మృతి
ప్రముఖ నృత్య దర్శకుడు డి.వేణుగోపాల్ (94) చెన్నైలో కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం సాయంత్రం స్థానిక టి.నగర్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె వున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం పూడివాడ గ్రామానికి చెందిన వేణుగోపాల్ తెలుగుతో పాటు కన్నడ, బెంగాలీ తదితర భాషల్లో మొత్తం 150కి పైగా సినిమాలకు నృత్య దర్శకుడిగా వ్యవహరించారు.

అన్ని భాషలలోను కలిపి సుమారు 150 చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించిన ఆయన, నాటి టాప్ హీరోయిన్లు సావిత్రి, వహీదా రెహమాన్, జమున తదితరులకు ఆయనే డ్యాన్స్ చేయడం నేర్పించారు. కన్నడ చిత్రాలు జేనుగోడు, కవిరత్న, కాళిదాస, అపూర్వ సంగమ, సతీ సక్కుబాయి మొదలైన చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.

ముద్దుబిడ్డ, అక్కాచెల్లెలు, సంతానం, సంకల్పం, దైవబలం, మాయింటి మహాలక్ష్మి, అత్తా ఓ ఇంటి కోడలే, మోహినీ భస్మాసుర (కన్నడ, బెంగాలీ) తదితర చిత్రాలకు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. నటీమణులు సావిత్రి, వహీదా రెహ్మాన్, వాణిశ్రీ, జమున తదితరులు ఆయన వద్దనే నృత్యం అభ్యసించారు. 'వధూవరులు' సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన..

1958లో 'నవరస మంజరి', 1965లో 'ద ఇండియన బ్యాలెట్ సెంటర్ ఫైన్ ఆర్ట్స్' సంస్థల్ని నెలకొల్పి నృత్యానికి ఎంతో సేవ చేశారు. సృష్టి, జ్ఞాననేత్రం, నాట్యశాస్త్ర దర్పణం పుస్తకాలను కూడా రచించారు. వేణుగోపాల్ భౌతికకాయానికి బుధవారం ఉదయం టి.నగర్ కన్నమ్మపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.