Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
'బాహుబలి' కి కర్ణాటక నుంచి లీగల్ నోటీస్
బెంగళూరు: ప్రభాస్, అనుష్క జంటగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కర్ణాటక,కర్కాళ కి చెందిన జైన మఠం నుంచి లీగల్ నోటీస్ ఇష్యూ చేసినట్లు సమాచారం. హింసాత్మక చిత్రానికి 'బాహుబలి' అనే టైటిల్ పెట్టవద్దని ఆ నోటీసులో కోరినట్లు తెలుస్తోంది. బాహుబలి లేదా గోమఠేశ్వర విగ్రహం కర్ణాటక లోని శ్రావణబెళగొళ లో ఉంది. నిస్వార్ధానికి, త్యాగానికి ప్రతీకగా జైనులు ఈ విగ్రహాన్ని కొలుస్తారు.
ప్రజలలో కల కధనం మేరకు బాహుబలి మరియు భరత (అతడి పెద్ద సోదరుడు) ఇరువురూ రాజకుమారులు. తమ ఆధిపత్యం కొరకు ఒకరితో మరి ఒకరు పోరాడుతారు. పోరాటంలో గెలిచిన బాహుబలి తన తమ్ముడిని క్షమించి వదిలేస్తాడు. ఇదే సమయంలో యుద్ధం, చంపుకొనటం వంటివి ప్రయోజనంలేనివిగా గుర్తిస్తాడు. వెంటనే తన రాజ్యాన్ని తమ్ముడు భరతుడికి అప్పగించి దిగంబర జైన మతంలో చేరతాడు. మోక్షానికి మార్గం కోరుతూ బాహుబలి తనకు దివ్యత్వం చేకూరే వరకు దిగంబరంగా ఉండిపోతాడు.
ఇక ఈ చిత్రం కథ సైతం అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరుగా తీర్చి దిద్దుతున్నారని తెలుస్తోంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ - మేకింగ్ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం 'బాహుబలి' కోసం రామోజీ ఫిల్మ్సిటీ ఉడ్లాండ్ ప్రాంతంలో ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఇందులో చిత్ర ప్రధాన తారాగణమంతా ఉండబోతోంది. ఇప్పటికే నటీనటులకు పూర్తి శిక్షణ ఇచ్చిన రాజమౌళి యుద్ధానికి అందరినీ సన్నద్ధుల్ని చేస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రెండు రోజులు సెలవులు తీసుకున్న యూనిట్ మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటోంది. ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రధారులైన ఈ సినిమాకి ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు.
రెండు టీజర్లు ఇప్పటికే ఈ సినిమా 'రుచి' ఏమిటో చూచాయిగా చూపించాయి. తెర వెనుక ఎంత కష్టపడుతున్నారో వాటిని చూస్తుంటే అర్థమవుతూనే ఉంది. అందరి కష్టం ఒక ఎత్తయితే, ప్రభాస్ కష్టం మరో ఎత్తు. ఈ సినిమా కోసం బరువు పెరిగాడు. 'బాహుబలి' టైటిల్కి నూటికి నూరుశాతం న్యాయం చేయడానికి కఠోరశ్రమ చేశాడు. కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలూ నేర్చుకొన్నాడు. రెండేళ్లపాటు కొత్తకథలేం వినకూడదని నిర్ణయించుకొన్నాడు. బహు కష్టజీవి అనిపించుకొన్నాడు.