Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఈ సారి ఎన్టీఆర్ యూట్యూబ్ రికార్డ్
హైదరాబాద్ : ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోల క్రేజ్ ని యూ ట్యూబ్ లో కొలుస్తున్న సంగతి తెలిసిందే. హీరోల నటించిన చిత్రాల పాటలు లేదా టీజర్ యూ ట్యూబ్ లో విడుదల చేసి అవి ఎంత మంది చూసారో అన్నదాన్ని రికార్డ్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఆ వంతు ఎన్టీఆర్ కు వచ్చింది. రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ హీరోగా చేసిన 'రామయ్యా వస్తావయ్యా'చిత్రంలోని జాబిల్లి నువ్వే చెప్పమ్మా పాట ని విడుదల చేసారు. ఆ పాట ఇప్పుడు యూ ట్యూబ్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఈ రెండు రోజుల్లో 637,772 వ్యూస్ వచ్చాయి.
అలాగే ... ప్రేమించిన అమ్మాయి అలిగితే.. ఆ అలకని తీర్చడానికి ప్రేమికుడు అమ్మాయినే బతిమలాడుతాడు. కానీ మా సినిమాలో హీరో జాబిల్లిని బతిమలాడుతాడు. ఆ భామకి నచ్చజెప్పమని అడుగుతాడు. చిరుగాలినే ఉయ్యాలగా చేసి అమ్మాయిని బుజ్జగించాలని కోరుతాడు. ఆ సంగతేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్లో కొత్త లుక్, నూతన సంభాషణ శైలి చూస్తారు. యువతరానికి నచ్చే కుటుంబ కథాచిత్రంగా నిలుస్తుంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాము''అంటున్నారు దిల్రాజు.
దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతోన్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. ఎన్టీఆర్, సమంత జంటగా నటిస్తున్నారు. శ్రుతిహాసన్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. హరీష్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని శనివారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఎన్టీఆర్తో తనకిది హ్యాట్రిక్ హిట్ అవుతుందని తమన్ నమ్మకం వ్యక్తం చేశారు. సానుకూల దృక్పథాన్ని పెంపొందించే పాట రాశానని అనంతశ్రీరామ్ చెప్పారు. ఇందులో కొత్త ఎన్టీఆర్ని చూస్తారని స్క్రీన్ప్లే రచయిత రమేష్రెడ్డి అన్నారు. కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, ముఖేష్రుషి, రవిశంకర్, రావురమేష్, అజయ్, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చోటా కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.