Don't Miss!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- News వైసీపీలోకి జనసేన మఖ్య నేతలు - పిఠాపురం పై గురి..!!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ....
పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్ర పోషించిన 'కొమరం పులి", మహేష్ బాబు నటించిన 'మహేష్ ఖలేజా", ఎన్టీఆర్ తో తెరకెక్కిన'బృందావనం".. మూడు చిత్రాలు నెల రోజుల వ్యవధిలో విడుదల కావడం తెలిసిందే. మళ్లీ వేసవికి కూడా ఈ ముగ్గురు టాప్ హీరోల చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి.
జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో 'లవ్ ఆజ్ కల్"కు రీమేక్ గా నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న చిత్రం వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ చిత్రానికి అధికారికంగా టైటిల్ ఇంకా ప్రకటించకపోయినా..'వల్లీ"'తీన్ మార్" అనే రెండు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అలాగే, మహేష్ బాబు-శ్రీనువైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న 'దూకుడు" చిత్రాన్ని కూడా సమ్మర్ స్పెషల్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఖలేజా" కూడా నిరాశపరిచినందున మహేష్ ఫ్యాన్స్ 'దూకుడు" చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక, ఈ ఏడాది సంక్రాంతికే విడుదలవుతుందని ప్రకటించబడిన ఎన్టీఆర్ 'శక్తి" కూడా వేసవి వినోదం అందించేందుకు బరిలోకి దిగనుంది. తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేయడమే సరైనదని దర్శకనిర్మాతలతోపాటు చిత్ర కథానాయకుడు ఎన్టీఆర్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు మొనగాళ్లు మరొకసారి 'ఢీ అంటే ఢీ" అనబోతున్నారా అనే ఆసక్తికర చర్చ టాలీవుడ్ లో మొదలు కానుంది.