Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
బాలకృష్ణ ఫ్యాన్స్కు హ్యాపీ న్యూస్: ‘పైసా వసూల్’ రిలీజ్ డేట్ ఖరారు
బాలయ్య ‘పైసా వసూల్’ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'పైసా వసూల్'. ఇటీవల విడుదలైన ఈ సినిమా స్టంపర్కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. అభిమానులయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఈ సంతోషంలో వారికి ఇంకో శుభవార్త. 'పైసా వసూల్'ను సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్టు నిర్మాత వి. ఆనందప్రసాద్ ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతమందించిన పాటల్ని అతి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అభిమానులకు పండగే...
ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ- ‘‘నందమూరి అభిమానులు కోరుకునే అంశాలన్నీ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. బాలకృష్ణగారు ఫుల్ ఎనర్జిటిక్ పాత్రలో ఇరగదీసి నటించారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లను ఆయన డూప్ లేకుండా చేశారు. ఇప్పటివరకు ఆయన్ను చూడని విధంగా, ఓ కొత్త పాత్రలో ఇందులో చూస్తారు. తొలిసారి బాలకృష్ణగారితో పని చేస్తున్నందుకు గర్వంగానూ, ఆనందంగానూ ఉంది. మా నిర్మాత ఆనందప్రసాద్గారు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమా బాగా రావడానికి కృషి చేశారు'' అన్నారు.
Recommended Video
పైసా వసూల్ మూవీ
నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ- ‘‘ఇటీవల విడుదలైన ‘పైసా వసూల్' స్టంపర్కు అద్భుత స్పందన లభిస్తోంది. ‘తమ్ముడూ... నేను జంగిల్ బుక్ సినిమా చూడలె . కాని అందులో పులి నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి', ‘మందేసిన మదపుటేనుగునిరా! క్రష్ ఎవ్రీవన్' డైలాగులు అభిమానులను అలరిస్తున్నాయి. సినిమా కూడా ఇదే రేంజ్లో ఉంటుంది. సెప్టెంబర్ 1న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. బాలకృష్ణగారి ఇమేజ్కి, కథకు తగ్గ పాటలను అందించారు అనూప్ రూబెన్స్ . త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
తెర వెనక
శ్రియ, ముస్కాన్, కైరా దత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్-హాలీవుడ్ నటుడు కబీర్ బేడి ప్రత్యేక పాత్ర పోషించారు. ఇంకా అలీ, పృథ్వీ, పవిత్రా లోకేష్, విక్రమ్ జిత్ తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: అనూప్ రూబెన్స్.
అందరినీ నలిపేస్తా..... బాలయ్య ‘పైసా వసూల్' స్టంపర్ అదుర్స్
పూరికి ఈ మధ్య సరైన హిట్ లేక పోవడంతో ఆయన బాలయ్యతో చేస్తున్న ‘పైసా వసూల్' మూవీని కొందరు చాలా తక్కువ అంచనా వేశారు. నట సింహం వేట ఎలా ఉండబోతుందనేది దర్శకుడు పూరి జగన్నాథ్ ‘స్టంపర్' అనే చిన్న శాంపిల్ తో చూపించారు. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. విలన్స్కు 101 ఫీవర్... ఫ్యాన్స్కు బంపర్ ఆఫర్... స్టంపర్ ఈజ్ సింప్లీ సూపర్... సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే డిస్కషన్ .