Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఏం కోల్పోయామో తెలుస్తోంది:పరుచూరి బ్రదర్శ్
మేం సాధించిన విజయాలు చూసి ఈ రోజు పొంగిపోతున్నామేమో. కానీ ఆలోచిస్తే ఏం కోల్పోయామో తెలుస్తుంది. రామకృష్ణ స్డూడియోస్లో కూర్చుంటే ఫలానా సంవత్సరంలో ఇక్కడ కూర్చుని ఫలానా డైలాగు రాశాం అని బాగానే గుర్తొస్తుంది. కానీ మా కుటుంబంతో గడిపిన జ్ఞాపకాలేం గుర్తుండవు అంటూ ఆవేదనతో చెప్తున్నారు పరుచూరి గోపాల కృష్ణ. టీఎస్సార్ లలితకళాపరిషత్తు పరుచూరి బ్రదర్స్ కి విశ్వవిఖ్యాత రచనాసార్వభౌములు అనే బిరుదుని ప్రదానం చేసిన సందర్భంగా వారు మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు.
అదే విషయమై పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... మా ప్రస్ధానం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే సాగింది. నిజం ఓ నటుడు డైలాగు చెప్పి పక్కకెళ్లిపోతాడు. ఓ దర్శకుడి పని యాక్షన్తో మొదలై కట్తో అయిపోతుంది. రచయిత అలా కాదు రేపటి సన్నివేశం కోసం కుస్తీ పట్టాలి. ఈ 33 యేళ్లూ అదే చేశాం. చేస్తూనే ఉన్నాం. ఇంట్లో పరిస్థితి ఏమిటో ఏనాడూ కనుక్కోలేదు. పని ధ్యాసలో పడి పిల్లల చదువులు కూడా పట్టించుకోలేదు అన్నారు.
ప్రస్తుత తెలుగు సినిమా పరిస్ధితిని వివరిస్తూ... హీరో పాత్ర చిత్రణ ఆధారంగా కథలు అల్లేస్తున్నారు. నాలుగైదు సన్నివేశాలుంటే వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు. మరి మిగిలిన సన్నివేశాల మాటేంటి? ఇలాగైతే సినిమా ఎక్కడ మొదలై ఎక్కడ ఆగుతుందో తెలీదు. కథ రాయడానికి ఓ రచయిత ఉంటాడనే సంగతి మరచిపోతున్నారు. డీవీడీల్లోంచి కథలు పుట్టేస్తున్నాయి అని చెప్పుకొచ్చారు.