Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'సర్ధార్' షాక్ : టిక్కెట్ కోసం ఇల్లు అమ్మేసాడు, పవన్ కు తెలుసా?
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ సినిమా వస్తోందంటే ఎంత రేటు పెట్టి కొనైనా మొదటి రోజు చూడాలనుకుంటారు అభిమానులు. అది రెగ్యులర్ గా జరిగే విషయమే. అయితే ఇల్లు, పొలం అమ్మి ఎప్పుడూ సినిమా టిక్కెట్లు కొనటం మాత్రం జరగలేదు. ఇప్పుడు కర్నాలులో ఓ అభిమాని ఇల్లు అమ్మేసి అందరికీ షాక్ ఇచ్చారు.
అందుతున్న సమాచారం ప్రకారం.. సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్రం ఈ నెల 8న విడుదల కాబోతుండగా, కర్నూల్ జిల్లాలో ఓ అభిమాని తన అభిమాన హీరో సినిమాకోసం 10 లక్షల ఇల్లు అమ్మేసి టిక్కెట్లు కొన్నాడట. ఇది విన్న తోటి అభిమానులు షాక్ అవుతున్నారు. మరి ఈ విషయం పవన్ దగ్గరకు చేరిందో లేదో కానీ. మీడియా మాత్రం ఓ రేంజిలో పబ్లిసిటీ ఇస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8న విడుదల కానున్న ఈ సినిమా సందడి ఇప్పటికే మొదలై జోరుగా సాగుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలాచోట్ల ఓ రేంజ్లో నడుస్తున్నాయి. ఇక సినిమాకు ఈ స్థాయి క్రేజ్ ఉన్న నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు కూడా టికెట్ ధరను పెంచే ప్రయత్నాలు మొదలెట్టి, ఫర్మిషన్ కోసం తిరుగుతున్నాయి.
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలాప్రాంతాల్లో టికెట్ ధర పెంపు కోసం థియేటర్ యాజమాన్యాలు అప్లికేషన్స్ పెట్టుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. కృష్ణా జిల్లాలో టికెట్ ధర పెంపు కోసం అన్ని థియేటర్ల నుంచి అప్లికేషన్స్ వెళ్ళినట్లు సమాచారం. ఇక బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శరత్ మరార్ భారీ బడ్జెట్తో నిర్మించారు. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు.