చెన్నై వరద భాధితులకు పవన్ కళ్యాణ్ విరాళం
హైదరాబాద్: టాలీవుడ్ తారలు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. వరదలు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు బాధితులకు తమవంతు సహాయ, సహకారాలు అందజేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ చేరారు. ఆయన రెండు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ విషయమై రామ్ గోపాల్ వర్మ ట్వీట్ సైతం చేసి మెచ్చుకున్నారు.
ఇప్పటికే ...మహేష్ బాబు, ఎన్టీఆర్ బాదితుల సహాయార్థం తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి తలో రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. కల్యాణ్రామ్ రూ.5 లక్షలు, వరుణ్తేజ్ రూ.3 లక్షలు, సంపూర్ణేశ్బాబు రూ.50 వేలు విరాళం ప్రకటించిన విషయం విదితమే.
రవితేజ అయితే ...రూ.5 లక్షల చేస్తు తన పేస్ బుక్ ఖాతా ద్వారా 'నాకు తోచిన సాయం నేను చేసాను, ఈలాంటి సంగటనలు జరిగినప్పుడే మన సాటి పౌరులకు సాయం చేయలని.' తెలిపారు.

ఇరవై లక్షలు రూపాయలు సాయం తమిళ వాసులకు అందించానని, 18 సంవత్సరాలు అక్కడ గడిపానని, ఐ లవ్ చెన్నై అంటూ అల్లు అర్జున్ తెలిపారు.


Click it and Unblock the Notifications











