మనటీవీ లో పవన్ ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇదీ.... కుర్చీలు విసిరేసి వీరంగం
తమ హీరో సినిమాకి రేటింగ్ 3 ఇచ్చారని పవన్ కళ్యాణ్ అభిమానులు టీవీ యాంకర్ పై విరుచుకుపడ్డారు. కుర్చీలు విసిరివేసి హంగామా సృష్టించారు.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మరోసారి రెచ్చిపోయారు. కాటమరాయుడు సినిమా విడుదల సందర్భంగా ఓ ఛానల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న పవన్ ఫ్యాన్స్ స్టూడియో లైవ్ లోనే రచ్చ రచ్చ చేశారు. హీరో పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా కాటమరాయుడుపై భిన్నమైన టాక్ వచ్చింది . సోషల్ మీడియాలోఅయితే రకరకాల రైటప్స్ వచ్చాయి . అలాగే ఈ సినిమాపై వెబ్సైట్స్ లో, పత్రికల్లో సమీక్షలు కూడా భిన్నంగానే వచ్చాయి .

అయితే మన టీవీ అనే ఒక చానెల్ అభిమానులను పిలిచి సినిమా పై చర్చ జరిపింది. అంతా అయ్యాక యాంకర్ కాటమరాయుడు కు రేటింగ్ 3 ఇస్తున్నట్టు చెప్పాడు. అంతే అప్పటివరకూ కూల్ గా ఉన్న ఫ్యాన్స్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మా హీరో సినిమాకి అంత తక్కువ రేటింగ్ ఇస్తావా అంటూ భగ్గుమన్నారు. యాంకర్ పై విరుచుకుపడ్డారు. కుర్చీలు.. విసిరివేసి హంగామా సృష్టించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారాయి.
నిజానికి కాటమరాయుడు పై డివైడ్ టాక్ నడుస్తోంది అక్కడ ఉన్నది పవన్ కాకపోయి ఉంటే కనీస కలెక్షన్లు కూడా రావన్నది అందరు సమీక్షకుల మాట. సాధారణంగా 3 పాయింట్ రేటింగ్ అంటే అంత తక్కువేమీ కాదు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఇంకా గొప్పగా ఊహించుకుని అంత తక్కువ ఇస్తారా అంటూ అక్కడ ఉన్న సిబ్బంది పై దాడికి దిగారు. అయినా సినిమాలో దమ్ముంటే ఏ రివ్యూలూ, రేటింగ్ లూ ఏం చేయలేవన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఎప్పుడూ కాంట్రవర్సీలకీ, గొడవలకీ దిగేది ఫ్యాన్స్ లో ఉండే అత్యుత్సాహమే...


Click it and Unblock the Notifications











