‘సర్దార్’ నిర్మాత శరత్ మరార్ గురించి ఆసక్తికర విషయాలు
హైదరాబాద్: 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్ర నిర్మాతగా గత కొంత కాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యాడు శరత్ మరార్. శరత్ మరార్ అసలు తెలుగువాడు. ఈ మధ్య కాలంలోనే అతను ఇండస్ట్రీలో లైమ్ లైట్ లోకి వచ్చాడు. పవన్ కళ్యాణ్కు క్లోజ్ ఫ్రెండ్ కావడంతో అతి త్వరలోనే సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకున్నాడు.
తాజాగా శరత్ మరార్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనకు శరత్ మరార్ ఇటీవల కాలం నుండి మాత్రమే తెలుసు. కానీ మెగా స్టార్ ఫ్యామిలీతో శరత్ మరార్కు పదిహేనేళ్లకు పైగా సన్నిహిత సంబంధం ఉందట. ఈ క్రమంలో అతను పవన్ కళ్యాన్కు దగ్గరయ్యాడు.
శరత్ మరార్ గతంలో మాటీవీ సీఈవోగా పని చేసారు. చిరంజీవికి సన్నిహితుడు కావడం, అతను సమర్థుడు కావడంతో చిరంజీవే ఆయన్ను మాటీవీ సీఈవోగా నియమించారట. ఈ క్రమంలోనే శరత్ మరార్కు మెగా కుటుంబంతో మంచి అనుబంధం ఏర్పడింది. ముఖ్యంగా పవన్ కళ్యాన్తో మంచి స్నేహం ఏర్పడింది.
ఫోటో గ్యాలెరీ : సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్
గతంలో పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి కూడా శరత్ మరార్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాట. తర్వాత పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన 'గోపాల గోపాల' చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇపుడు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంతో పూర్తి స్థాయి నిర్మాతగా మరారు.

శరత్ మరార్
మెగా ఫ్యామిలీతో శరత్ మరార్ కు 15 ఏళ్ల నుండి సన్నిహిత పరిచయం ఉంది.

క్లోజ్ ఫ్రెండ్
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కు శరత్ మరార్ క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు.

మాటీవీ
గతంలో శరత్ మరార్ మాటీవీ సీఈఓగా పని చేసారు.

సర్దార్
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో శరత్ మరార్ పూర్తి స్థాయి నిర్మాతగా మరారు.

లైఫ్ టర్నింగ్
సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం తనకు లైఫ్ టర్నింగ్ మూవీ అవుతుందని శరత్ మరార్ భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











