Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హిమాచల్ ట్రాజెడీ: పవన్ కళ్యాణ్ కూడా వెళ్లారంటూ ప్రచారం, ఆర్థిక సహాయం?
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నది వద్ద జరిగిన ప్రమాదంలో 25 మంది తెలుగు విద్యార్థులు వరద ప్రవాహానికి కొట్టుకు పోయి మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. రెండు రాష్టాల ప్రభుత్వాలు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. కనీసం మృతదేహాలైనా కుటుంబాలకు అప్పగించాలనే ఉద్దేశ్యంతో గాలింపు చర్యలు తీవ్రంగా కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వార్తల్లో తాజాగా పవన్ కళ్యాణ్ పేరు కూడా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ ఘటన చాలా డిస్టర్బ్ చేసిందని, అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన విషయాలను స్వయంగా తెలుసుకోవడానికే పవన్ హిమాచల్ ప్రదేశ్ కి బయలుదేరి వెళ్లాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాన్ స్వయంగా మృతుల కుటుంబాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అయితే ఈ విషయం ఇంకా ఎక్కడా అపీషియల్గా వెల్లడి కాలేదు. కావాలనే పవన్ ఇందుకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచుతున్నారని టాక్.
పవన్ కళ్యాణ్ సినిమా విషయానికొస్తే...ప్రస్తుతం ఆయన 'గోపాలా గోపాలా' చిత్రంలో నటిస్తున్నారు. హిందీలో సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రానికి ఇది రీమేక్. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మల్టీ స్టారర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు కిషోర్ పార్ధసాని' ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. వ్యాపారి పాత్రలో నటించే వెంకటేష్కు జోడీగా 'శ్రియ' నటిస్తున్నారు. పాపులర్ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఒక పాట రికార్డింగ్ అయింది. మరో వారం రోజుల్లో మొత్తం పాటల రికార్డింగ్ పూర్తవుతుంది అని చిత్ర నిర్మాతలు డి.సురేష్ బాబు.శరత్ మరార్ లు తెలిపారు.