Don't Miss!
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి!
హైదరాబాద్: 'జల్సా', 'అత్తారింటికి దారేది' చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ తనకు అత్యంత సన్నిహితుడైన 'హారిక అండ్ హాసిని' క్రియేషన్స్ సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ కోసం ఈ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట.
పవన్ కళ్యాణ్ తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం చేయడానికి త్రివిక్రమ్ ఓ కథ తయారు చేసాడట. ఈ కథ పవన్ కళ్యాణ్ కి కూడా బాగా నచ్చిందట. దాంతో పవన్, త్రివిక్రమ్ ప్లాన్ చేసిన 'కోబలి' చిత్రాన్ని పక్కన పెట్టి ఈ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నారట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాచేస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
ఇక త్రివిక్రమ్ నితిన్ హీరోగా మరో సినిమా చేస్తున్నారు. 'హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ ' బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి టైటిల్ ఖరారు అయ్యింది. "అ...ఆ" ...ట్యాగ్ లైన్ గా .. "అనసూయ రామలింగం వెర్శస్ ఆనంద్ విహారి " అని ఫిక్స్ చేసినట్లు నిర్మాత మీడియాకు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో తెలియచేసారు.
ఇక ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా సమంత, మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ (ప్రేమమ్ ఫేమ్ మళయాళి భామ) చేస్తోంది. . ఈ నిర్మాతతో త్రివిక్రమ్ కు ఇది మూడో సినిమా. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత ఈ నిర్మాత చేస్తున్న చిత్రం ఇదే. సెప్టెంబర్ మూడవ వారం నుంచి ఈ చిత్రం మొదలుకానుంది. సంక్రాంతికి కు విడుదల చేస్తారు.
ఈ చిత్రం కు సౌండ్ డిజైనర్ గా విష్ణు గోవింద్, శ్రీ శంకర్ పనిచేయనున్నారు. సంగీతం అనిరుధ్, సినిమాటోగ్రఫి నటరాజ్ సుబ్రమణ్యన్, ఆర్ట్ రాజీవన్, ఎడిటింగ్ ...కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...పిడివి ప్రసాద్. ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.