Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మధ్యలో బన్నీ, త్రివిక్రమ్ను లాగింది.. అంత కంటే ఏం చేయలేరంటూ బాలీవుడ్ దుమ్ము దులిపిన పాయల్
ప్రస్తుతం బాలీవుడ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సుశాంత్ సింగ్ మరణం తరువాత బాలీవుడ్ పరిస్థితి మరీ ఘోరంగా దిగజారిపోయింది. ప్రతీ ఒక్కరూ నెపోటిజం, మాఫియా అంటూ బాలీవుడ్ను ఏకిపారేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్లో రీమేక్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ విషయంపై పాయల్ ఘోష్ స్పందింస్తూ ఓ రేంజ్లో ఏకిపారేసింది. అసలే సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్ను ఓ రేంజ్లో టార్గెట్ చేస్తూ వస్తోంది పాయల్. తాజాగా రీమేక్ల విషయంలోనూ మరో లెవెల్లో కామెంట్ చేసింది.
సోషల్ మీడియాలో వైరల్..
ప్రయాణం, ఊసరవెల్లి చిత్రాలతో ఫేమస్ అయిన పాయల్ ఘోష్ ఈ లాక్ డౌన్ కాలంలో అంతకు పదింతలు ఫేమస్ అయింది. మీరాచోప్రా వివాదం, సుశాంత్ మరణం, బాలీవుడ్, దక్షిణాది పరిశ్రమలపై కామెంట్స్ చేయడం, అవి కాస్తా మీడియాలో ప్రధానంగా వైరల్ కావడంతో పాయల్ పేరు మార్మోగిపోయింది.
బాలీవుడ్ ఓ నరకం..
సుశాంత్ మరణం అనంతరం బాలీవుడ్పై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో పాయల్ కూడా స్పందించింది. బాలీవుడ్లో హీరోయిన్లను చిన్న చూపు చూస్తారని, కించపరుస్తారని చెప్పుకొచ్చింది. అదే దక్షిణాదిలో, తెలుగులో హీరోయిన్లను ఎంతో గౌరవిస్తారని, అది స్వర్గం, బాలీవుడ్ నరకమని ఓ రేంజ్లో ఫైర్ అయింది. తాజాగా కంగనాపై జరుగుతున్న ట్రోల్స్ పైనా స్పందించింది.
మద్దతిచ్చిన పాయల్..
సుశాంత్ విషయంలో కంగనా మాట్లాడుతూ తాప్సీని బీ గ్రేడ్ యాక్టర్ అని సంబోధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కంగనాపై ట్రోల్స్ జరిగాయి. వాటిపై పాయల్ ఘోష్ ఫైర్ అయింది. సోఫాలో కూర్చుని, కాఫీ తాగుతూ ఎదుటి వారి గురించి చెడ్డగా మాట్లాడటం ఈజీయేనని చెప్పుకొచ్చింది. కానీ కంగనాను అందరూ కలిసి ఇలా టార్గెట్ చేయడం చూస్తుంటేనే బాలీవుడ్ అంటే ఏంటి? అందులోని మనుషులు ఎలాంటి వారో అర్థమవుతోందని ఫైర్ అయింది.
తాజాగా రీమేక్లు..
బాలీవుడ్లో ప్రస్తుతం రీమేక్ల పర్వం జరుగుతోంది. ఇప్పటికే కబీర్ సింగ్ బాక్సాఫీస్ షేక్ చేసింది. అప్పటి నుంచి తెలుగు చిత్ర పరిశ్రమపై బాలీవుడ్ కన్ను పడింది. ఇక ఇదే వరుసలో జెర్సీ చిత్రాన్ని రీమేక్ చేయబోతోన్నారు. తాజాగా హిట్ సినిమాను రీమేక్ చేయబోతోన్నట్టు ప్రకటించేశారు. ఎఫ్2ను కూడా రెడీ చేస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అల వైకుంఠపురములో చిత్రాన్ని కూడా రీమేక్ చేయబోతోన్నారని తెలిసింది.
Recommended Video
అంత కంటే ఏం చేయలేరు..
అల వైకుంఠపురములో చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయడంపై పాయల్ ఘోష్ స్పందించింది. ‘బాలీవుడ్కు ఏమైంది? అల వైకుంఠపురములో చిత్రాన్ని రీమేక్ చేయాలని అనుకుంటోంది. అల్లు అర్జున్ అద్భుతమైన నటుడు.. ఒకవేళ త్రివిక్రమ్ గనుక తెరకెక్కించకపోతే అది కచ్చితంగా వేస్ట్.. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇక్కడ కంటెంట్ లేదు.. కేవలం రీమేక్స్ తప్పా ఏం చేయలేరు' అంటూ బాలీవుడ్ను పాయల్ ఏకిపారేసింది.