క్యూట్ అండ్ హాట్ లుక్తో కుర్ర హీరోయిన్ (ఫోటోలు)
హైదరాబాద్: రంగం సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన పియా బాజ్పాయ్ ఆ తర్వాత తెలుగులో వచ్చిన 'బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్', 'దళం' చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా అమ్ముడు అటు గ్లామర్ పరంగా ఇటు పెర్ఫార్మెన్స్ పరంగా మంచి పేరే తెచ్చుకుంది.
ఇండస్ట్రీలో గ్లూకోజ్ స్వీటీగా పేరుతెచ్చుకున్న పియా బాజ్పాయ్ ఎప్పుడూ చలాకీగా ఉంటుంది. ఆ ఆటిట్యూడ్ వల్లనే ఆమెను దర్శకులు చలాకీగా ఉండే పాత్రలకు ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం పియా బాజ్పాయ్ కొట్టమ్, నేరుంగి వా ముతమిడతే అనే తమిళ చిత్రాలతో పాటు, కెల్వి అనే మళయాలం చిత్రంలో, ఎక్స్ అనే ఇంగ్లీష్ చిత్రంలో నటిస్తోంది.
ప్రియా బాజ్పాయ్కి చెందిన మరిన్ని వివరాలు....క్యూట్ అండ్ హాట్ ఫోటోలు స్లైడ్ షోలో.....

పియా బాజ్పాయ్
పియా బాజ్పాయ్ 4 జనవరి 1986న ఎటావ (ఉత్తర్రపదేశ్)లో జన్మించింది. డిప్లమో ఇన్ కంప్యూటర్ సైన్స్ చదవింది. వీరి కుటుంబం తరువాత ఢిల్లీలో స్థిరపడ్డారు

రంగం సినిమా ద్వారా
2011లో వచ్చిన ‘రంగం' సినిమాలో జీవా సరసన రెండో హీరోయిన్గా నటించిన పియా... ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో ఒక్కసారిగా గుర్తింపు వచ్చింది.

2008లోనే...
2008లో ‘పొ య్ సొల్ల పోరమ్' అనే తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన పియా.. ఆ తదుపరి సంవత్సరమే ‘నిన్ను కలి సాక' అనే తెలుగు సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో పియాకు ఇక్కడ పేరు రాలేదు.

అలా అవకాశాలు
2010లో గోవా, బాలె పాండి యా చిత్రాల్లో నటించింది. 2011లో ‘కో' సినిమా లో సెకండ్ హీరోయిన్గా నటించినప్పటికీ ఆ సినిమా సూపర్ హిట్టవ్వ డంతో ఒక్కొక్క టిగా అవకాశాలు రావడం మొదలయ్యింది.

కుటుంబ నేపథ్యం
ఉత్తరప్రదేశ్లోని ఎటావ పట్టణంలో జన్మించిన పియా బాజ్పాయ్ ఢిల్లీలో సెటిలయ్యింది. కంప్యూ టర్స్లో డిప్లొమా చేసిన పియా... నటి అవ్వాలనే కోరిక ను తొలుత ఆమె తల్లి దండ్రులు వ్యతిరేకించారు.

టీవీ రంగం ద్వారా
తొలుత టీవీ సీరియళ్ళకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేసింది. తరు వాత కొన్ని ప్రింట్ యాడ్స్తో పాటు, కొన్ని మ్యూజిక్ ఆల్బమ్లలో కూడా కనిపించింది.

మలుపు తిప్పిన యాడ్
తరువాత ‘క్యాడ్బరీ' కమర్షియల్ యాడ్లో వచ్చిన అవకాశం పియా కెరీర్ను మలుపుతిప్పింది. ఆ యాడ్లో అమితాబ్ బచ్చన్, క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీలతో కలిసి నటించింది పియా. తరువాత మెల్లగా పియా అడుగులు సినిమా వైపు పడ్డాయి.


Click it and Unblock the Notifications











