Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్బాబు వెళ్లి పరామర్శించాడు (ఫొటో)
హైదరాబాద్: గుంటూరు లోక్సభ సభ్యుడు, తన బావ గల్లా జయదేవ్ను సినీనటుడు మహేశ్బాబు పరామర్శించారు. ఆగస్టు 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో జయదేవ్ గాయపడిన సంగతి తెలిసిందే. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన ఇటీవలే ఇంటికి చేరుకున్నారు.
అయితే తాను కోలుకొని నడవగలుగుతున్నానంటూ.. ఫేస్బుక్ ద్వారా తెలిపారు. సినీ నటుడు మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి జయదేవ్ను పరామర్శించారు. ఈ సందర్భంగా వారితో కలిసిన దిగిన ఓ ఫొటోను జయదేవ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇక్కడ మీరు చూడండి.
Progressing... could get up and take a few steps at home today, with Mahesh Babu & family
Posted by Jayadev Galla on 11 September 2015
మహేష్ బాబు తాజా చిత్రం విషయానికి వస్తే....
‘శ్రీమంతుడు' తో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు పూర్తి ఉత్సాహంతో సెప్టెంబర్ 16 నుంచి ఆయన తదుపరి చిత్రం బ్రహ్మోత్సవం షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. అందుకోసం టెంపుల్ సిటీ అయిన తిరుపతిని ఎంచుకున్నారు. అనగా బ్రహ్మోత్సవం ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో మొదలు కానుంది.
ఆ షెడ్యూల్ లో మహేష్ బాబు కూడా పాల్గొననున్నాడు. సెప్టెంబర్ 16 నుంచి ఆగకుండా ఏకధాటిగా షూటింగ్ చేసే విధంగా షెడ్యూల్స్ ప్లాన్ చేసారు. కంటిన్యూగా షూటింగ్ చేసి 2016 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని పివిపి బ్యానర్ పై ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు.