క్షమాభిక్ష కోరను: మున్నాబాయ్ (పిక్చర్స్)
ముంబై: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో జైలు శిక్ష పడిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాను క్షమాభిక్ష కోరబోనని స్పష్టం చేశారు. జైలు శిక్ష అనుభవిస్తానని చెప్పారు. తగిన సమయంలో తాను కోర్టు ముందు లొంగిపోతానని మున్నాబాయ్ చెప్పారు. ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తాను క్షమాభిక్ష కోరడం లేదని, దానిపై చర్చ అవసరం లేదని సంజయ్ దత్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన కన్నీరు పెట్టారు. తనకు ఇది అత్యంత కష్టకాలమని, తనను ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నానని ఆయన అన్నారు.
1993 ముంబై వరుస బాంబు పేలుళ్లు కేసులో సంజయ్ దత్కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. 53 ఏళ్ల సంజయ్ దత్ మరో మూడున్నరేళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. ఇదివరకు ఆయన 18 నెలల పాటు జైలులో ఉన్నారు.

నేను క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడం లేదు: సంజయ్ దత్

1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు సంజయ్ దత్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

తగిన సమయంలో తాను లొంగిపోతానని సంజయ్ దత్ చెప్పారు.

ఇది తనకు అత్యంత కష్ట కాలమని ఆయన అన్నారు.

సోదరి ప్రియాదత్తో సంజయ్ దత్

సంజయ్ దత్ ఇది వరకు 18 నెలల పాటు జైలులో ఉన్నారు.


Click it and Unblock the Notifications











