Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! ఢిల్లీ నుంచి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
కొలవెరి సాంగ్ ఫేం అనిరుద్పై పోలీసులకు ఫిర్యాదు
తాజాగా ఈ యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్ర్ చిక్కుల్లో పడ్డారు. తాజాగా అతనిపై ఓ లాయర్ పోలీస్ ఫిర్యాదు చేసారు. అమర్యాదకరమైన సాహిత్యంతో కూడిన ఓ సాంగును అతను యూట్యూబులో పోస్టు చేసి తన సోషల్ నెట్కర్కింగు ద్వారా షేర్ చేయడమే ఇందుకు కారణం.
సెన్సార్ చేయని ఆ పాటను పోస్టు చేసిన అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలిన సదరు లాయర్ డిమాండ్ చేసారు. సదరు సాంగ్ వీడియో మహిళలను అవమానించే విధంగా, మతపరమైన భావాలను కించపరిచే విధంగా ఉందని ఫిర్యాదు దారుడు ఎస్.జేబదాస్ పేర్కొన్నారు. వెంటనే ఆ వీడియో రిమూవ్ చేసి అనిరుధ్ రవించంద్రన్పై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ సంగతి పక్కన పెడితే...అనిరుధ్ తనను మోసం చేశాడని వరుణ్ మణియన్ అనే నిర్మాత ఆరోపించారు. ప్రస్తుతం తను నిర్మిస్తున్న 'వాయై మూడి పేసవుమ్' అనే చిత్రానికి పాటలివ్వడానికి అనిరుధ్ ఒప్పుకున్నాడని, అతనికి 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చానని వరుణ్ మణియన్ పేర్కొన్నారు. కానీ, అనిరుధ్ పాటలివ్వలేదని, దాంతో వేరే సంగీతదర్శకుణ్ణి పెట్టుకున్నానని ఆయన తెలిపారు. అనిరుధ్ అడ్వాన్స్ వెనక్కి తిరిగి ఇవ్వలేదని, అతనిపై చర్య తీసుకోవాలని నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు వరుణ్ మణియన్.