Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఓ వైపు డ్రగ్స్ కేసు కలకలం: రామానాయుడు స్టూడియోకు పోలీసులు!
రామానాయుడు స్టూడియోలో పోలీసులు తనిఖీ నిర్వహించారు. విదేశాల నుండి పార్శిల్ రావడంపై పోలీసులు ఈ తనిఖీ చేశారు.
టాలీవుడ్ చిత్ర సీమలో కొన్ని రోజులుగా డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ వాడినట్లు అనుమానాలు ఉండటంతో రవితేజ, పూరి జగన్నాథ్, చార్మి, సుబ్బరాజు, నవదీప్, తరుణ్, తనీష్, ముమైత్ ఖాన్ లాంటి స్టార్లను పిలిపించి పోలీసులు విచారించారు.
పోలీసులు 12 మంది టాలీవుడ్ స్టార్లకు నోటీసులు పంపినా.... ఇంకా బయటకు రాని పేర్లు చాలా ఉన్నాయని, అందులో బడా నిర్మాతల కొడుకులు, ఇంకొందరు స్టార్స్ ఉన్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా రామానాయుడు స్టూడియోకు ఎక్సైజ్ పోలీసులు రావడం చర్చనీయాంశం అయింది.
రామానాయుడు స్టూడియోకు పోలీసులు ఎందుకొచ్చినట్లు?
డ్రగ్స్ కేసు వ్యవహారం నేపథ్యంలో కొన్ని రోజులుగా విదేశాల నుండి వచ్చిన పార్సిల్స్ మీద ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో విదేశాల నుండి రామానాయుడు స్టూడియోకి పార్సిల్ రావడంతో ఎక్సైజ్ శాఖ సీఐ పరిశీలించేందుకు వెళ్ళారు.
Recommended Video
అసలు ఏం పార్శిల్ వచ్చింది?
ఎక్సైజ్ సీఐ రామానాయుడు స్టూడియోకు వచ్చిన నేపథ్యంలో నిర్మాత సురేష్ బాబు స్పందించారు. వెన్ను నొప్పిని తగ్గించేందుకు రానా ఓ పరికరాన్ని విదేశాల నుండి తెప్పించుకున్నాడు. అది పరిశీలించడానికే ఎక్సైజ్ అధికారులు స్టూడియోకి వచ్చారని తెలియజేశారు.
రానా, అభిరామ్ పేరు రావడంపై
కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ కేసు వ్యవహారంలో రానా, అభిరామ్ పేర్లు వార్తలు వినిపించాయి. అపుడు వెంటనే సురేష్ బాబు స్పందించారు. తన కొడుకులకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, మమ్మల్ని ఇందులోకి లాగొద్దని కోరారు.
కావాలనే
ఓ సెక్షన్ మీడియా కావాలనే నా కుమారులు రానా, అభిరామ్ ను డ్రగ్స్ వివాదంలోకి లాగుతోంది. మాకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదు. మాకు ఎవరూ కాల్ కూడా చేయలేదు. మా కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తికి ఈ వివాదంతో సంబంధం లేదు అని సురేష్ బాబు వివరణ ఇచ్చారు.