Don't Miss!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఆ విషయంలో ప్రకాష్ రాజ్కు పూనమ్ కౌర్ మద్దతు.. పవన్ కళ్యాణ్ టాపిక్ను కావాలనే తీసిందా?
గత వారంలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్లు.. దానికి కౌంటర్లుగా ప్రకాష్ రాజ్ మీద నాగబాబు నిప్పులు చెరగడం, తిరిగి ప్రకాష్ రాజ్ కూడా నాగబాబు కౌంటర్లు వేయడం మీడియాలో సంచలనలంగా మారాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ధోరణి మీద కామెంట్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచనలం రేపింది. ఇప్పుడు ఆ విషయాన్ని పరోక్షంగా తెర మీదకు తీసుకొచ్చింది పూనమ్ కౌర్.
ప్రకాష్ రాజ్ కామెంట్స్..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాటలు మార్చడంపై ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేశాడు. మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై స్పందిస్తూ ఊసరవెల్లి అంటూ కామెంట్ చేశాడు. బీజేపీతో నడుస్తున్నప్పుడు మళ్లీ నీకు జనసేన ఎందుకు అంటూ ప్రశ్నించాడు. ఇలా పవన్ కళ్యాణ్పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లకు నాగబాబు ఫైర్ అయ్యాడు. అలా ఆ విషయం మీడియాలో బాగా వైరల్ అయింది.
నేడు అలా..
అయితే ప్రస్తుతం కేంద్రం తీసుకురాబోతోన్న వ్యవసాయ చట్టాలపై రైతులు ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. అయితే ప్రకాష్ రైతులకు మద్దతుగా వేసిన ట్వీట్ బాగానే వైరల్ అయింది. కానీ మీడియాలో మాత్రం అంతగా రాలేదు.
పూనమ్ కౌర్ రియాక్షన్..
పూనమ్ కౌర్ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ టాపిక్ను లాగింది. ప్రకాష్ రాజ్ ఓ యాక్టర్, రాజకీయ నాయకుడు గురించి మాట్లాడితే మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ రైతుల సమస్యలపై మాట్లాడితే మాత్రం ఎవ్వరూ ప్రసారం చేయడం లేదంటూ మండి పడ్డింది.
Recommended Video
బలయ్యాను..
పూనమ్ చేసిన ట్వీట్కు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. మీడియాకు వారి వారి ఎజెండాలున్నాయని అన్నాడు. అవును సర్.. ఆ ఎజెండాల వల్ల నేను ఎంతో బలయ్యాను.. నాకు అది పూర్తిగా అర్థమైంది సర్.. రైతులు, సైనికులు, నేత కార్మికులు మన దేశం సంప్రదాయం.. ఆచారలకు ప్రతీక.. వారు కార్పోరేటర్స్ కాదు.. అంటూ పూనమ్ స్పందించింది.