Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నా కల నిజమైన రోజు.. రిపబ్లిక్ డే రోజున ప్రకాశ్ రాజ్ ఏం చేశాడో తెలుసా
రిపబ్లిక్ డే సందర్భంగా దత్తత తీసుకొన్న పాలమూరు జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని నటుడు ప్రకాశ్ రాజ్ సందర్శించారు.
జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకొన్నా.. సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని తిరిగి సమాజానికి ఇస్తేనే అందులో ఆనందం ఉంటుందని నిరూపించారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. రిపబ్లిక్ డే సందర్భంగా తాను దత్తత తీసుకొన్న పాలమూరు జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'నా కల వాస్తవ రూపం దాల్చిన రోజు. నాకు ఇది నిజమైన రిపబ్లిక్ డే'అని అన్నారు.
గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ మరమత్తులు చేసిన పాఠశాల భవనంలో విద్యార్థులు, గ్రామస్తులతో మాట్లాడారు. చదువులో ప్రతిభ చూపిన పిల్లలకు బహుమతులను అందేజేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకొన్నారు. 'ప్రజలతో భాగమవ్వడం, వారి ఆనందంలో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది' అని ట్వీట్ చేశారు. గతంలో పాలమూరు జిల్లా కొండారెడ్డి గ్రామాన్ని ప్రకాశ్ రాజ్ దత్తత తీసుకొన్న సంగతి తెలిసిందే.