Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘ప్రేమకథా చిత్రమ్’50: కృష్ణ, మహేష్ హ్యాపీ
హైదరాబాద్ : ప్రేమకథా చిత్రమ్ భారీ విజయం సాధించడంతో కృష్ణ, హహేష్ బాబు చాలా హ్యాపీగా ఉన్నారని హీరో సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. సుధీర్ బాబు, నందిత హీరో హీరోయిన్లుగా జె. ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో మారుతి మీడియా హౌస్ రూపొందించిన 'ప్రేమకథా చిత్రమ్' విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో ఫంక్షన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ... 'ప్రేమకథా చిత్రమ్ విజయవంతం కావడంతో నా బాధ్యత మరింత పెరిగింది. సినిమా విజయం పట్ల మామయ్య కృష్ణతో పాటు, మహేష్ బాబుకు కూడా ఆనందంగా ఉన్నారు. మహేష్ బాబు సినిమా విజయవంతం అయినప్పుడు కృష్ణగారు ఎంత సంతోషంగా ఫీలవుతారు ఇప్పుడు నా విషయంలోనే అదే విధంగా ఫీలవుతున్నారు. నాకు ఇంత పెద్ద విజయం అందించిన అందిరికీ కృతజ్ఞతలు' అని తెలిపారు.
మారుతి మాట్లాడుతూ...'సుధీర్ బాబు వల్లనే ఈ సినిమా తెరకెక్కింది. నేను రెండు కథలు చెబితే ఆయన దీన్నే ఒకే చేసారు. నందిత పెర్ఫార్మెన్స్ సినిమాకు కీలకంగా మారింది. ఆమె కోసమే పాత్ర నిడివి పెంచాను.ఇండియా మొత్తం మీద ఎక్కువ రేటుకు రీమేక్ హక్కులు పొందిన చిత్రమని చెప్పడానికి గర్వంగా ఫీలవుతున్నాను. ఈ చిత్రాన్ని తమిళం, మలయాళంలో కాశీ విశ్వనాథ్ రీమేక్ చేస్తున్నారు' అని తెలిపారు.
డార్లింగ్ స్వామి మాట్లాడుతూ....సినిమా ఇప్పటికే 66 రోజులు పూర్తయిందని, త్వరలో 100 రోజులు పూర్తి చేసుకోబోతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం, సి.కళ్యాణ్, లగడపాటి శ్రీధర్, ఎంఎస్ రాజు, స్వామి, సురేస్ కొండేటి, కాశీవిశ్వనాథ్ హాజయ్యారు.