ప్రియమణి జోలికివెళ్ళద్దు జాగ్రత్త
ప్రియమణితో ఏమన్నా ప్లాన్స్ ఉంటే మానుకోవటం మంచిది అంటున్నారు. ఏమిటీ అంటే ఇప్పుడు ప్రియమణి కర్రసాము అనే విద్య నేర్చుకుని ఎలాంటివారినైనా ఎదిరించేందుకు సిద్దంగా ఉంది. ఇప్పుడామె కర్రసాములో మాస్టర్ అయ్యింది. అయితే హఠాత్తుగా ప్రియమణికి ఈ కర్రసాముపై దృష్టి ఎందుకు పడింది అంటే క్షేత్రం సినిమా కోసం అని తెలిసింది. జగపతి బాబుతో చేస్తున్న ఈ చిత్రంలో చేస్తున్న విభిన్నమైన పాత్ర కోసం ఈ కర్రసాము నేర్చుకుంది. ఆ విషయం ఆమె ప్రస్దావిస్తూ...నేను కర్రసాము నేర్చుకోవాలి అంటే మొదట భయపడ్డాను. కానీ తర్వాత కొద్ది రోజులు ప్రాక్టీసు చేసేటప్పటికి అందులో ఆరితేరిపోయాను. దాదాపు ఇప్పుడు కర్ర తిప్పటంలో నేను మాస్టర్ అయ్యిపోయాను.
కర్ర సాము అనేది ఓ పురాతన విద్య.మొదట్లో కర్ర తిప్పటం చాలా కష్టమనిపించింది. కానీ కథకు ఈ పార్ట్ చాలా అవసరం కావటంతో నేను పూర్తి దృష్టి పెట్టాను అంది. ఈ చిత్రంలో నేను చాలా యాక్షన్ సన్నివేసాలలో డూపు లేకుండా నేనే చేసాను అని చెప్పుకొచ్చింది. అలాగే ఈ చిత్రంల కత్తితో పోరాటం కూడా ఉంది కానీ అది ఎంతో సేపు కాదు..కాబట్టి పెద్ద గా ప్రాక్టీసు అవసరం లేకపోయింది అని చెప్పింది. చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''ఆధునిక కాలంలో కొనసాగే ఈ చిత్ర కథ అనుకోకుండా ఓ చారిత్రక నేపథ్యంలోకి మలుపు తిరుగుతుంది. ఇందులో భాగంగా వచ్చే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్గా వుంటుంది"" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కోటి, కెమెరా: ఎమ్వీ రఘు, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సుద్దాల అశోక్తేజ, ఆర్ట్: రఘు కులకర్ణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అక్కినపల్లి విజయ్ కుమార్.


Click it and Unblock the Notifications











