Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అప్పులు చేసి చిక్కుల్లో పడ్డ నిర్మాత ఏఎం రత్నం
నష్టాల, అప్పుల కారణంగా గత నాలుగైదేళ్లుగా ఆయన సినిమాలేవీ నిర్మించడం లేదు. తాజాగా అప్పు ఇచ్చిన వాళ్లు ఆయన్ను కోర్టు కీడ్చారు. చెన్నైకి చెందిన ఫిల్మ్ ఫైనాన్సియర్ కృష్ణన్ ఏఎం.రత్నంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఏఎం రత్నం తమకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వడంలో విఫలం అయ్యాడని కోర్టులో పిటీషన్ దాఖలు చేసాడు.
కృష్ణన్ చెప్పిన వివరాల ప్రకారం 'కాలన్' అనే చిత్రం కోసం తన తల్లి వద్ద నుంచి రూ. 1.5 కోట్లు తీసుకున్నాడని, సినిమా విడుదల(జనవరి 2006) ముందే సంవత్సరానికి 18 శాతం వడ్డీతో తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడని, కానీ అసలు చెల్లించి వడ్డీ ఎగ్గొట్టాడని తెలిపారు.
ఆ తర్వాత సర్దుబాటులో భాగంగా రత్నం, సదరు ఫైనాన్సియర్ మరో సినిమా కోసం సరికొత్త అగ్రిమెంటు కుదుర్చుకున్నారు. సంవత్సరానికి 36 శాతం వడ్డీతో గడువులోపు డబ్బు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. రత్నం ఇప్పుడు సదరు నిర్మాతకు రూ. 4.60 కోట్లు బాకీ పడ్డాడట. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెలుతుందో చూడాలి.