Just In
- 18 min ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
- 23 min ago
రజనీకాంత్ మరో షాక్ ఇవ్వబోతున్నారా?.. సినిమాలను ఆపేసిన తలైవా.. ఆ దర్శకుడి తీరుతో అనుమానాలు
- 26 min ago
పెళ్లి విషయం దాచిపెట్టడంపై కౌంటర్.. అందరి ముందు రవి పరువుదీసిన సుమ
- 1 hr ago
పెళ్లికి ముందే బ్రేకప్.. బిగ్ బాస్ లో వచ్చిన డబ్బు అలా ఖర్చు చేశా: బిగ్ బాస్ 1 విన్నర్ శివ బాలాజీ
Don't Miss!
- Lifestyle
కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
- News
హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ స్పందన- షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు- త్వరలో కీలక భేటీ
- Automobiles
అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఉపయోగించే 'దెయ్యం' కారు గురించి తెలుసా?
- Finance
10 నెలల్లో 100% లాభాలు, ఆరు నెలల్లో సెన్సెక్స్ 54,000!
- Sports
హైదరాబాద్ చేరుకున్న సిరాజ్.. టోలిచౌక్లో కోలాహలం! సాయత్రం మీడియాతో సమావేశం!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విషాదం: మూవీ మొఘల్ రామానాయుడు ఇకలేరు
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నిర్మాత, దాదా పాల్కే అవార్డు గ్రహీత డాక్టర్. దగ్గుబాటి రామానాయుడు(78) కన్నుమూసారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన బుధవారం కన్నుమూసారు. రామానాయుడు అనారోగ్యంతో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా గోప్యంగా ఉంచుతూ వస్తున్నారు.

రామానాయుడికి 13 ఏళ్ల క్రితం ప్రొస్టేట్ క్యాన్సర్ సోకినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఆయన చికిత్స తీసుకున్నారు. అయితే కొన్ని నెలల క్రితం మళ్లీ సమస్య ఏర్పడిందని తెలుస్తోంది. ఇంగ్లీషు మందులతో శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుండటంతో హోమియో, ఆయుర్వేద చికిత్స చేయించినట్లు సమాచారం.
ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
రామానాయుడు ఇప్పటి వరకు 13 బాషల్లో 150 వరకు చిత్రాలు నిర్మించారు. ఆరుగురిని హీరోలుగా, 21 మందిని దర్శకులుగా, 12 మందిన హీరోయిన్లుగా పరిచయం చేసారు. వివిధ బాషల్లో అత్యధిక సినిమాలు నిర్మించిన నిర్మాతగా గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డులైన దాదా సాహెబ్ ఫాల్కె, పద్మభూషణ్ తో సహా పలు అవార్డులతో సత్కరించింది.
రామానాయుడు మృతితో తెలుగు సిని పరిశ్రమ విషాదంలో మునిగి పోయింది. పలువురు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబుతో సహా పలువురు సంతాపం వ్యక్తం చేసారు.