Don't Miss!
- News ఏపీలో కూటమి కోసం ప్రధాని మోదీ కీలక నిర్ణయం..!!
- Sports ఆ నిర్ణయమే మమ్మల్ని గెలిపించింది- పంత్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సీనియర్ తెలుగు దర్శక, నిర్మాత మృతి
నెల్లూరు జిల్లా వెంకటగిరి చెందిన ఆయన 'సంసారం' సినిమాతో నిర్మాతగా తెలుగు చిత్రీసీమకి పరిచయమయ్యారు. ఇందులో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు హీరోలు. ఎల్వీ ప్రసాద్ దర్శకులు. అక్కినేనికి ఇదే తొలి సాంఘిక చిత్రం కావడం విశేషం. మహానటి అనిపించుకున్న సావిత్రి 'సంసారం'లో చిన్న పాత్రలో కనిపిస్తారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తెలుగులో పాడిన తొలి గీతం 'నిదురపోరా తమ్ముడా'. ఇది దాస్ తీసిన 'సంతానం' సినిమాలోనిదే.
తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో దాస్ ఆ తరవాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ఎన్టీఆర్ నటించిన 'దాసి' చిత్రానికి దర్శకత్వం వహించారాయన. ఆపైన స్వీయ దర్శకత్వంలో 'సంతానం', 'తోబుట్టువులు', 'సంకల్పం' నిర్మించారు. అన్నీ విజయవంతమయ్యాయి. 'సంకల్పం' తరవాత ఆయన చిత్రసీమకు దూరమై ఇతర వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు.
ప్రసిద్ధ గాయనీమణి లతామంగేష్కర్తో తెలుగులో తొలి పాట పాడించిన ఘనత రంగనాథ్దాస్దే. 'సంతానం' సినిమా కోసం సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పన చేసిన 'నిదురపోరా తమ్ముడా..' పాటను ఆలపించారు లతా. అలాగే సావిత్రిని వెండితెరకు పరిచయం చేసినది కూడా రంగనాథ్దాస్. సాధన ప్రొడక్షన్స్ పతాకంపై తోబుట్టువులు, సంకల్పంలాంటి పలు చిత్రాలు నిర్మించారు. వాటిలో రజతోత్సవాలు జరుపుకున్న చిత్రాలు ఎక్కువ. 1960తోనే రంగనాథ్దాస్ సినీ జీవితం పూర్తయిందని చెప్పాలి. ఆ తర్వాత ఆయన చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.