Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పాక్ నటులపై నిషేదం సరైనదే: పవర్ స్టార్ స్పందన
హైదరాబాద్: యూరీ ఘటన తర్వాత భారత్, పాక్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్ పాకిస్థాన్ నటులను నిషేధించడాన్ని కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సమర్ధించారు.
యూరి ఘటన తర్వాత భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పాకిస్థాన్ నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, సంగీత దర్శకులు పనిచేసే సినిమాలపై సీవోఈఏఐ ( సినిమా ఓనర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నిషేధం విధించింది.
ఈ పరిణామాలపై పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ స్పందిస్తూ... "కళ కంటే దేశం చాలా గొప్పది.. ముందు మనమందరం భారతీయులం ఆ తరువాతే కళాకారులం.. పాకిస్థాన్ నటులను నిషేధించాలన్న డిమాండ్ సరైనదే" అని అన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఐశ్వర్యరాయ్, రణబీర్, అనుష్క ప్రధాన పాత్రల్లో కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ యే దిల్ హై ముష్కిల్ చిత్రం చిక్కుల్లో పడింది. 'యే దిల్ హై ముష్కిల్' సినిమాలో పాక్ నటుడు ఫవాద్ఖాన్ నటించమే ఇందుకు కారణం.