Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆకాశ్ టార్చర్ పెట్టాడు.. మహేష్ కోసం కథ.. రాజమౌళి కాళ్లకు దండం.. పూరీ జగన్నాథ్
Recommended Video
బద్రి, పోకిరి, చిరుత, బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై, బిజినెస్ మెన్ లాంటి చిత్రాలతో సెన్సేషనల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకొన్న పూరీ జగన్నాథ్కు ఈ మధ్యకాలంలో సరైన హిట్టు కరువైంది. ఆ నేపథ్యంలో పూరీ రూపొందించిన చిత్రం మెహబూబా. తన కుమారుడు ఆకాశ్ను హీరోగా చేసి ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్పై తెరకెక్కించారు. ఈ చిత్రానికి నటి చార్మీ ఓ నిర్మాతగా వ్యవహరించింది. ఈ చిత్రం మే 11న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకాశ్పై పూరీ పంచులు విసిరాడు. ఆయన ఏమన్నారంటే..
హీరో ఆకాశ్ గురించి
నా కెరీర్లో ఇప్పటి వరకు 35 సినిమాలు చేశాను. కానీ ఫస్ట్టైం ఓ నిజాయితీతో కూడిన సినిమా తీశాననిపిస్తున్నది. ఈ సినిమా హీరో ఆకాష్ గురించి చెప్పాలి. చిన్నప్పటి నుంచి అతడు మా ఇంట్లోనే ఉండేవాడు. 5 ఏళ్ల వయసులో ఆకాష్ నేను ఉదయం లేవగానే నా ముందు ఉండేవాడు. చిరంజీవి, బాలకృష్ణ డైలాగ్స్ చెప్పి వేషం ఇవ్వమన వేధించాడు.
ఆకాశ్ టార్చర్ తట్టుకోలేక
ఆకాశ్ టార్చర్ తట్టుకోలేక చిరుత సినిమాలో వేషం ఇచ్చాను. ఆ తర్వాత పోకిరి సమయంలో నా వద్దకు వచ్చి మహేష్బాబు కోసం కథ రాశాను అని చెప్పాడు. దాంతో వీడి దగ్గర ఏం కథ ఉందో అని విన్నాను.
ఆకాశ్ చెప్పిన కథ ఇదే..
మహేష్బాబుకు ఓ పదేళ్ల ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ వీడే. వీడిని చూడకుండా మహేష్బాబు ఉండలేదు. కానీ విలన్లు ఓ దశలో మహేష్ను చంపేస్తారు. ఆ తర్వాత ఆ విలన్లను పదేళ్ల కుర్రాడు చంపి పగతీర్చుకుంటాడు అని ఆకాశ్ నాకు కథ చెప్పాడు. అనంతరం మహేష్కు చెప్పమని అడిగాడు.
మహేష్బాబు తన్నడం ఖాయమని..
అప్పుడే నేను ఆకాశ్తో నేను ఏమన్నాన్నంటే.. నీవు చెప్పిన కథ మహేష్కు చెబితే నిన్ను, నన్ను తన్నేస్తాడు అని అన్నాను. ఆ కథలో వీడు హీరో వేషం వేసి మహేష్కు వేషం ఇచ్చాడు అని ఆకాశ్ సెటైర్ వేశాడు.
నా దగ్గర డబ్బులుంటే హీరో చేస్తా
అప్పడు నేను ఆకాశ్కు మాట చెప్పాను. నీవు హీరో కావాలంటే కనీసం పదేళ్లు పడుతుంది. అప్పటికీ నా కెపాసిటీ ఉంటే, నా పరిస్థితి బాగుంటే.. నా దగ్గర డబ్బులు ఉంటే నీతో సినిమా చేస్తాను. అప్పటి వరకు నీ ప్రయత్నాలు ఏవో నీవు చూసుకో అని చెప్పాను.
రాజమౌళి కాళ్లకు మొక్కేవాడు
అప్పటి నుంచి రాజమౌళి, వినాయక్, సుకుమార్ దృష్టిలో పడేందుకు ట్రై చేసేవాడు. వాళ్లు మా ఇంటికి వస్తే కాళ్లకు దండం పెట్టుకొనే వాడు. కానీ ఇప్పుడు నా పరిస్థితి బాగుంది. అందుకే మెహబాబా సినిమా ఆకాశ్తో తీశాను అని పూరి జగన్నాథ్ అన్నారు.