Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అమలా పాల్తో కలిసి పూరి నర్సీపట్నం షో...
పూరి, అమలాపాల్ రాకతో భారీగా అభిమానులు తరలి వచ్చారు. అయితే పూరి మొహంలో మాత్రం ఊహించిన సంతోషం కనిపించలేదు. తాము ఊహించిన స్థాయిలో సినిమా రిజల్ట్ లేక పోవడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. సినిమా ఎలా ఉందనే సంగతి పక్కన పెడితే....పూరితో కలిసి సినిమా చూసే అవకాశం దక్కించుకున్న అభిమానులు మాత్రం సంబరపడిపోయారు.
కాగా...ఈ రోజు విడుదలైన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. పూరి జగన్నాథ్, బన్నీ కాంబినేషన్లో సినిమా అని భారీ అంచనాలు పెట్టుకుని వెళ్లిన సినీ ప్రేమికులు.....దర్శకుడు సినిమాను నడిపించిన తీరు చూసి నిరాశ పడక తప్పలేదు. అయితే అల్లు అర్జున్ డాన్సులు, యాక్షన్స్ సీన్స్ బాగా చేసి తన అభిమానులకు తృప్తిపరిచాడు.
బ్రహ్మానందం, నాజర్, షావర్ అలీ, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: అమూల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, కథ,మాటలు, స్క్రీన్ప్లే,దర్శకత్వం: పూరి జగన్నాథ్.