twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ రాశి రీ ఎంట్రీ...డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : గోకుళంలో సీత, శుభాకాంక్షలు చిత్రాల ద్వారా హీరోయిన్ గా పాపులర్ అయిన తెలుగు హీరోయిన్ రాశి ఆతర్వాత చిన్న చిన్న సినిమాలకు మాత్రమే పరిమితం అయింది. అవకాశాలు తగ్గడంతో వ్యాంపు క్యారెక్టర్లు కూడా చేసింది. చివరి సారిగా ఆమె మహేష్ బాబు హీరోగా వచ్చిన 'నిజం' చిత్రంలో విలన్ గా, అనంతరం రవితేజ వెంకీ చిత్రంలో ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించి తెరమరుగైంది. ఇప్పుడు ఆమె మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది.

    రాజేంద్రప్రసాద్ సరసన ఆమె హీరోయిన్ చేస్తూ ఓ చిత్రం మొదలైంది. రాజేంద్రప్రసద్ ప్రధాన పాత్రధారిగా అభి స్టూడియోస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాగర్‌, రాశి, మృదుల ఇతర ప్రధాన పాత్రధారులు. పి.ఎ.అరుణ్‌ప్రసాద్‌ దర్శకుడు. బి.సత్యనారాయణ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ సాగుతోంది.

    దర్శకుడు మాట్లాడుతూ ''ఆద్యంతం నవ్వులు పండించే కథతో దీన్ని తీర్చిదిద్దుతున్నాం. రాజేంద్రప్రసాద్‌ నటన అందరికీ నచ్చుతంది. మొగలిరేకులు ధారావాహికలో నటించిన సాగర్‌కు అంతకు మించిన గుర్తింపు తీసుకొస్తుంది ఈ చిత్రంలోని పాత్ర'' అన్నారు.

    కథతోపాటే హాస్యాన్ని మేళవించిన చిత్రంతో పాతరోజుల్ని ప్రేక్షకులకు గుర్తుకు తెస్తామన్నారు రాజేంద్రప్రసాద్‌. ఈ పాటల్ని విదేశాల్లో చిత్రిస్తామన్నారు నిర్మాత. ఈ చిత్రంలో గిరిబాబు, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్‌ నారాయణ, రఘుబాబు, పిల్లా ప్రసాద్‌, హేమ తదితరులు నటిస్తున్నారు.

    English summary
    Raasi is back. Raasi has been paired with actor Rajendra Prasad. The yet untitled film will be directed P A Arun Prasad. The film will also star Sagar and hugely popular TV star Mogali Rekulu as its leading man. He has been paired with newcomer Mrudula.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X