Don't Miss!
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
26న ‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్’
ఈ నేపథ్యంలో తెలుగు అవార్డు జ్యూరీ కమిటీ హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జ్యూరీ కమిటీ సభ్యుడు డి. సురేష్ బాబు మాట్లాడుతూ 'రేడియో మిర్చి సంస్థ గత నాలుగేళ్లుగా మ్యూజిక్ అవార్డులను అందజేస్తోంది. ఈ ఏడాది కూడా ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించి నిష్పక్షపాతంగా అవార్డు గ్రహీతలను ఎంపిక చేయడం జరిగింది' అన్నారు.
'మొత్తం 122 సినిమాలు, 672 పాటలను పరిశీలించి ఐదుగురిని ఎంపిక చేసాం. ఆ విజేతలెవరన్నది ఈ నెల 26న జరిగే అవార్డుల వేడుకలో తెలుస్తుందని తెలిపారు. సంగీత ప్రపంచంలోని ప్రతిభావంతులను ప్రొత్సహిస్తూ అవార్డులు అందించడం అభినందనీయమని ఆర్ పి పట్నాయక్ పేర్కొన్నారు.
పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే ఈ సారి చాలా విలువైన, అమూల్యమైన పాటలు వచ్చాయి. నిష్పక్షపాతంగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేసాం అన్నారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, మోహన కృష్ణ ఇంద్రగంటి, హాసం రాజా, రమణ గోగుల, కౌసల్య, రామజోగయ్య శాస్త్రి, రేడియో మిర్చి సీఈఓ ప్రశాంత్ పాండే తదితరులు పాల్గొన్నారు.