రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ కాంబినేషన్లో మరో మూవీ!

By Bojja Kumar

హైదరాబాద్: ‘కుమారి 21ఎఫ్' మూవీలో జంటగా నటించిన రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ తెరపై తమ రొమాంటిక్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఖరారైంది. గతంలో ‘దేనికైనా రెడీ' సినిమాకు దర్శకత్వం వహించిన జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

ఎకె ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. ‘కుమారి 21 ఎఫ్' చిత్రంలో హెబ్బా పటేల్ పెర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిన దర్శక నిర్మాతలు ఈ సినిమాలో ఆమెకు చాన్స్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

Raj Tarun, Hebah Patel romance again

ఇక మంచు విష్ణు సరసన నటించే హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది. ఈ మేరకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పంజాబిలో సూపర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగేశ్వర రెడ్డి సుశాంత్ తో ‘ఆటాడుకుందాం రా', మంచు విష్ణుతో ‘సరదా' చిత్రాలు చేస్తున్నారు. ఇవి పూర్తి కాగానే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

‘కమారి 21 ఎఫ్' తర్వాత రాజ్ తరుణ్ రామ్ గోపాల్ వర్మతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. దీంతో పాటు గీతా ఆర్ట్స్ బేనర్లో ఓ సినిమా, వంశీ దర్శకత్వంలో లేడీస్ టైలర్ రీమేక్, మంచు విష్ణుతో ఓ సినిమా చేయడానికి కమిట్ అయియ్యాడు. రాజ్ తరుణ్ తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోగా ఎదుగుతాడు అంటున్నారు విశ్లేషకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X