'ఊసరవెల్లి' కోసం షూటింగ్ కాన్సిల్: రాజమౌళి
ఎన్టీఆర్ తాజా చిత్రం ఊసరవెల్లి రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న ఈ సమయంలో ఫ్యాన్స్ కే కాక సెలబ్రెటీలకు సైతం చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో రాజమౌళి ట్వీట్ చేస్తూ...నేను 6 వ తేదీన కాన్సిల్ చేసుకున్నాను..మా కుటుంబం మొత్తం వెయిట్ చేస్తున్నాం. ఇంకా టిక్కెట్లు రాలేదు.. అంటూ ట్వీట్ చేసారు. ఇక రాజమౌళి,ఎన్టీఆర్ కి మంచి స్నేహం ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ,సింహాద్రి వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం రాజమౌళి ఈగ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు.
ఊసరవెల్లి విషయానికి వస్తే...ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం పతాకంపై ఛత్రపతి ప్రసాద్ నిర్మించిన చిత్రం 'ఊసరవెల్లి'. ఈ చిత్రానికి సమర్పణ భోగవల్లి బాపినీడు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చారు. ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రింట్లతో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నాం. ఆడియో పెద్ద హిట్ అయింది. ఎన్టీఆర్ చిత్రాల్లో వైవిధ్యమైన చిత్రంగా 'ఊసరవెల్లి' మిగిలిపోతుంది. డిఫరెంట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సురేందర్రెడ్డి. తప్పకుండా ప్రేక్షకులను ఆకుట్టకుంటుంది'' అన్నారు.


Click it and Unblock the Notifications











