Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ప్రభాస్ తో చేసే చిత్రం గురించి రాజమౌళి
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన తదుపరి చిత్రం హిందీ-తెలుగు బాషల్లో బైలింగ్వువల్ గా చేస్తానని అన్నారు. ఈగ హిందీ డబ్బింగ్ మక్కీ ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. అలాగే ఈ చిత్రం ఓ పీరియడ్ చిత్రం అని,చారిత్రికం మాత్రం కాదని తేల్చి చెప్పారు. ఇక అది ఓ జానపదం(ప్లోక్ స్టోరీ) అన్నారు. అంతేకాక సినిమా పునర్జన్మ మీద కాదనన్నారు. మగధీర,ఈగ వంటి కాన్సెప్టు కాదని తెలియచేసారు.
బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ప్రాంక్ గా చెప్పాలంటే నాకు బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ ..ఏమీ ఈగ విడుదల అయ్యేదాకా రాలేదు. ఇప్పుడు వరసగా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ సౌత్ లో కొన్ని ఇప్పటికే ఒప్పుకున్న కమిట్ మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తయ్యాకే బాలీవుడ్ ప్రయాణం అన్నారు. అఫ్ కోర్స్ ఓ స్టోరీ టెల్లర్ గా నా సినిమా ఎక్కువ మంది ఆడియన్స్ ని రీచ్ అవ్వాలనే కోరుకుంటాను అన్నారు.
'అందాల రాక్షసి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాటి ఈ చిత్రంలో చాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి చిత్రంలో ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చి రాజమౌళి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ ఈచిత్రంలో మెయిన్ హీరోయిన్ గా చేయనుందని సమాచారం. సోసియో ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త గెటప్ తో కనిపించనున్నాడు. ఈచిత్రాన్ని ఆర్కా మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఉంటుంది.
ఇక భారీ బడ్టెట్ తో రూపొందనున్న ఈ చిత్రానికి సంభందించి ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ శివార్లలో సుమార్ ఇరవై ఐదు ఎకరాల స్ధలంలో ఓ భారీ సెట్ ని వేస్తున్నారు. అలాగే ఈ చిత్రం కోసం పది డజన్ల గుర్రాలు బుక్ చేసారని సమాచారం. ఇటీవల ప్రభాస్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ముందు రాజమౌళితో సినిమా, ఆ తర్వాతే పెళ్లి అని స్పష్టం చేసాడు. డిసెంబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని, ఈచిత్రం తనకెంతో ప్రతిష్టాత్మకమని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.