Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మూవీ బాగుందని రాజమౌళి ట్వీట్, ఇక వారికి పండగే!
హైదరాబాద్ : ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా సినిమాలు తీసే దర్శకుడిగా, ఓటమి అంటూ ఎరుగని హిట్ చిత్రాల దర్శకుడిగా రాజమౌళి పేరుంది. మరి అలాంటి దర్శకుడు ఏదైనా సినిమా చూసి బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తే.....ప్రేక్షకుల్లోనూ ఆ సినిమాపై ఆసక్తి కలుగడం మామూలే. గతంలో రాజమౌళి ప్రశంసలు అందుకున్న సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్టయ్యాయి. మంచి వసూళ్లు సాధించాయి.
తాజాగా 'అంతకు ముందు ఆ తరువాత' అనే సినిమాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు రాజమౌళి. 'చాలా తక్కువ అంచనాలతో అంతకు ముందు ఆ తర్వాత సినిమాకు వెళ్లాను. కానీ బాగా ఎంజాయ్ చేసాను. నటీనటులంతా బాగా పెర్ఫార్మెన్స్ చేసారు...ముఖ్యంగా రావు రమేష్, రోహిణి, అవసరాల శ్రీనివాస్ మరియు నా గుడ్ ఫ్రెండ్ వెంకట్. కొత్త అమ్మాయి ఇషా ఆకట్టుకుంది. సుమంత్ అశ్విన్ పరిణతితో నటించాడు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' అని ట్వీట్ చేసారు.
ఇప్పటి వరకు అంతంత మాత్రంగానే ఉన్న 'అంతకు ముందు ఆ తరువాత' కలెక్షన్స్ రాజమౌళి ట్వీట్ తరువాత పెరుగుతాయని ఆశిస్తున్నారు. ఎందుకంటే రాజమౌళికి ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఫాలోవర్స్ లక్షల్లో ఉన్నారు. అందు వల్ల ఆయన ట్వీట్ మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నారు.
రంజిత్ మూవీస్ నిర్మించిన 'అంతకు ముందు.. ఆ తరువాత...' చిత్రంలో సుమంత్ అశ్విన్, ఈషా నాయకా నాయికలు. రోహిణి, మధుబాల, ప్రగతి, రవిబాబు, రావు రమేష్, ఉప్పలపాటి నారాయణరావు, అవసరాల శ్రీనివాస్, తాగుబోతు రమేష్, ఝాన్సీ, సుదీప, మాధవి, స్నిగ్ధ, పమ్మి సాయి, సొహైల్, అర్చన, అపర్ణ వర్మ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంత్ శ్రీరామ్, నృత్యాలు: నోబుల్, సుచిత్ర, పాపి, కళ: ఎస్.రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, సంగీతం: కల్యాణి కోడూరి, సహ నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి, నిర్మాత: కె.ఎల్.దామోదరప్రసాద్, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.