కేసీఆర్ మాటను చాలెంజ్గా తీసుకున్న రాజేంద్రప్రసాద్
హైదరాబాద్: మొక్కలు నాటుదాం పచ్చదనాన్ని పెంపొందిద్దా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఛాలెంజ్గా తీసుకున్నారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని ఫిలించాంబర్ వద్ద మొక్కలు నాటారు.
ఈసందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ....కేసీఆర్ హరితహారం పథకం ప్రారంభించడం సంతోషించదగిన విషయమన్నారు. చెట్లు అమ్మ తరువాత అమ్మలాంటివని, చెట్లను పెంచడం, వాటిని కాపాడటం మన బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ యాదవ్, ప్రజాగాయకుడు దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




Click it and Unblock the Notifications











