అనాథ పిల్లలతో రకుల్ బర్త్ డే సెలబ్రేషన్
అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ మంగళవారం తన పుట్టిన రోజును నిరాడంబరంగా జరుపుకొన్నారు.
అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ మంగళవారం తన పుట్టిన రోజును నిరాడంబరంగా జరుపుకొన్నారు. తన బర్త్ డేను పురస్కరించుకొని హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న చెరీష్ అనాథ శరణాలయంలోని పిల్లలతో గడిపారు. పిల్లలకు పుస్తకాలు, పిజా, బర్గర్ తదితర వస్తువులను పంపిణి చేశారు.

పిల్లలతో మమేకమై డ్యాన్సులతో ఆనందంగా సమయాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి పిల్లలను తన కామెడితో ఉత్సాహపరిచారు.
Recommended Video

Rakul Preet Singh About Sai Pallavi Craze, Going To Watch Fidaa

ఈ కార్యక్రమంలో రకుల్ ప్రీత్ మేనేజర్ హరినాథ్, పవన్ కుమార్తో చెరిష్ నిర్వాహకులు హేమలత, నీలిమ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











