Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బుల్లెట్స్తో దొరికిపోయిన తెలుగు హీరోయిన్, పోలీసు కస్టడీ
న్యూఢిల్లీ: ఇటీవల సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంలో హీరోయిన్గా నటించిన రాకుల్ ప్రీత్ సింగ్ను ఢిల్లీ ఎయిర్ పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆమె బ్యాగులో రివాల్వర్లో వాడే బుల్లెట్ దొరకడమే ఇందుకు కారణం. పోలీసులు బ్యాగ్ చెక్ చేస్తుండగా ఆమె వద్ద ఉన్న ల్యాప్ టాప్ బ్యాగులో ఈ బుల్లెట్ దొరికింది.
తనను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించిన విషయాన్ని రాకుల్ ప్రీత్ సింగ్ కూడా ధృవీకరించారు. ఓ ఆంగ్ల ప్రతికతో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్నివెల్లడించారు. 'తన వద్ద పోలీసులు తనిఖీల్లో 8 ఎంఎం బుల్లెట్ దొరికిన మాట వాస్తవమే అని, అవి ఇండియాలో దొరికే బుల్లెట్స్ కావు' అని ఆమె వెల్లడించారు.
పోలీసులు తనను తనిఖీ చేస్తుండటంతో భయ పడిపోయిన రాకుల్ ప్రీత్ సింగ్ వెంటనే ఆర్మీ ఆఫీసర్ అయిన తన తండ్రికి ఫోన్ చేసింది. సదరు బుల్లెట్స్ ఆయనకు చెందినవో లేదో అని అడిగి తెలుసుకుంది. అయితే ఆ బుల్లెట్ తనకు సంబంధించినది కాదని చెప్పడంతో...ఆ తర్వాత బాగా ఆలోచించిన రాకుల్ ప్రీత్ సింగ్ ఆ బుల్లెట్ గతంలో తాను షూటింగులో వాడిందని గుర్తు చేసుకుని పోలీసులుకు ఈ విషయాన్ని చెప్పింది.
ఓ తమిళ సినిమా షూటింగులో తాను రివాల్వర్ ఉపయోగించానని, అయితే అది టాయ్ బెల్లెట్ అని, నిజమైంది కాదని ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికి రాకుల్ ప్రీత్ సింగ్ తండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుని పోలీసులకు సర్ది చెప్పడంతో కథ సుఖాంతమైందట. చివరగా పోలీసులు ఆమెను ఆ బుల్లెట్ ఉపయోగించిన సినిమాకు సంబంధించి డీవీడీని పంపమని అడగటం కొసమెరుపు.